15 ఏళ్ల విద్యార్థితో లేచిపోయిన 40ఏళ్ల మహిళా టీచర్
అహ్మదాబాద్: నలభై ఏళ్ల ఉపాధ్యాయురాలు, 15 ఏళ్ల విద్యార్థితో పారిపోయింది. ఈ సంఘటన ఇరవై రోజుల క్రితం గుజరాత్లోని అహ్మదాబాదులో జరిగింది. వారిని పోలీసులు గుర్తించారు. సదరు విద్యార్థి ఈ టీచర్ వద్దకు ట్యూషన్ చెప్పించుకునేందుకు వచ్చేవాడు.
ఈ నేపథ్యంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. శారీరకంగా దగ్గరయ్యారు. ఒకే అపార్ట్మెంట్లో నివాసముండే వీరిద్దరు ఆ తర్వాత పారిపోయారు. ద్విచక్ర వాహనం పైన రెండు వేల రెండు వందల కిలోమీటర్లు మూడు రాష్ట్రాలను కవర్ చేస్తూ షికారు చేశారు. చివరకు పోలీసులకు చిక్కారు.
సదరు టీచర్ పేరు మనీషా జోషి. ఆమె ట్యూటర్గా పని చేస్తుంది. ఆమె వద్దకు పదో తరగతి విద్యార్థి ట్యూషన్కు వచ్చేవాడు. అతని పైన ఆ టీచర్ మనసు పడింది. టీనేజ్ వయస్సులో ఉన్న ఆ కుర్రాడు కూడా ఆమె మోహంలో పడ్డాడు. వీరికి ఓ స్నేహితుడు ఆర్థిక సాయం చేశాడు.
చివరకు సాయం చేసిన కుర్రాడి సాయంతోనే పోలీసులు వారిని గుర్తించారు. మనీషాపై పోలీసులు ప్రొటెక్షన్ ఆఫ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ కింద కేసు నమోదు చేశారు. బాలుడి తల్లిదండ్రుల స్టేట్మెంట్ రికార్డ్ చేసి అతనిని పంపించారు. ప్రస్తుతం ఆమె ఊచలు లెక్కిస్తోంది.