మిస్త్రీకి మరో షాక్: టాటా ఇండస్ట్రీస్ డైరెక్టర్ పదవి నుంచి ఔట్
ముంబై: టాటా గ్రూప్స్ అధినేత రతన్ టాటా.. సైరస్ మిస్త్రీకి మరో షాక్ ఇచ్చారు. టాటా ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్ పదవి నుంచి సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికారు. సోమవారం ఉదయం జరిగిన టాటా ఇండస్ట్రీస్ షేర్ హోల్డర్స్ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సభ్యులు ప్రకటించారు.
డైరెక్టర్ పదవి నుంచి మిస్త్రీని తొలగించాలంటూ సమావేశంలో పలువురు షేర్ హోల్డర్స్ సూచించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టాటా ఇండస్ట్రీస్ తెలిపింది. టాటా గ్రూపులోని ఆరు కంపెనీలు మిస్త్రీ తొలగింపునకై ఈజీఎంలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

చైర్మన్గా ఎన్నికయ్యేందుకు తప్పుదోవ పట్టించారని, చేసిన వాగ్దానాలు అమలు చేయలేదని, అధికారాలన్నీ తన ఆధీనంలో ఉంచుకుని, సంస్థ యాజమాన్య వ్యవస్థలను బలహీన పరచేందుకు మిస్త్రీ కుట్ర చేశారని టాటా సన్స్ ఆరోపించింది.
2011లో టాటా సన్స్ చైర్మన్ పదవికి అర్హుడిని ఎంపిక చేసేందుకు నియమించిన కమిటీని మిస్త్రీ తన ప్రకటనలతో తప్పుదోవ పట్టించారని టాటా సన్స్ పేర్కొంది. అలాగే 2015లో మిస్త్రీ ప్రవేశపెట్టిన నిబంధనావళి ప్రకారం చూసినా... టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తొలగింపునకు గురైన ఆయన గ్రూప్ సంస్థల బోర్డుల నుంచి స్వచ్ఛందంగా రాజీనామా చేయాల్సి ఉండగా వాటిని ఉల్లంఘించారని ఆరోపించింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications