మొబైల్ యూజర్స్ నెత్తిన భారీ పిడుగు.. కనీస డేటా టారిఫ్స్ ఏ రేంజ్లో పెరగనున్నాయంటే..
మొబైల్ ఇంటర్నెట్ డేటా విషయంలో ప్రపంచంలోనే అతి తక్కువ టారిఫ్లను భారతీయులు ఇన్నాళ్లు ఎంజాయ్ చేశారు,చేస్తున్నారు. కానీ త్వరలోనే దీనికి ఫుల్ స్టాప్ పడబోతోంది. ప్రస్తుతం ఒక జీబీ డేటాకు రూ.3.5 చొప్పున టెలికాం కంపెనీలు చార్జి చేస్తున్నాయి. కానీ రానున్న రోజుల్లో కనీస టారిఫ్స్ భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న కనీస టారిఫ్స్ కంటే ఈ ధరలు 5 నుంచి 10 రెట్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది.

నీతి ఆయోగ్ సీఈవో ఏమన్నారు..
అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్,ఐడియా ఒక జీబీ డేటాకు కనీసంగా రూ.35 టారిఫ్ విధించాలని ఇప్పటికే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI)కు ప్రతిపాదించాయి. భారతీ ఎయిర్టెల్ కనీస డేటా టారిఫ్ను రూ.30గా, రిలయన్స్ జియో రూ.20గా ప్రతిపాదించాయి. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఈ ప్రతిపాదనలను సమర్థించారు. భారీ అప్పులు,ధరల అస్థిరత్వం కారణంగా సతమతమవుతున్న టెలికాం రంగం.. వాటి నుంచే బయటపడాలంటే డేటా టారిఫ్స్,కాల్ చార్జీలు పెంచడం కంటే మరో మార్గం లేదన్నారు. ఫోన్ కాల్స్,డేటాకు సంబంధించి కనీస టారిఫ్లపై ట్రాయ్పై ఇటీవలే నీతి ఆయోగ్ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అభికాంత్ దాస్ ఇలా స్పందించారు.

ఎంత పెరగవచ్చు..
కాల్స్,డేటా టారిఫ్స్పై ఇప్పటివరకు ఆయా టెలికాం కంపెనీలకే పూర్తి స్వేచ్చ ఉండేది. కానీ సంస్థల మధ్య నెలకొన్న తీవ్ర పోటీ కారణంగా టారిఫ్స్ విషయంలో టెలికాం కంపెనీలే 'టెలికాం రెగ్యులేటరీ' జోక్యాన్ని కోరాయి. ప్రస్తుతం రూ.599 ప్లాన్లో రూ.3.5కే టెలికాం కంపెనీలు ఒక జీబీ డేటాను 4జీ స్పీడ్తో 84 రోజుల వాలిడిటీతో అందిస్తున్నాయి. కానీ టెలికాం కంపెనీల తాజా ప్రతిపాదనలకు ట్రాయ్ ఆమోదిస్తే గనుక.. అదే ప్లాన్ రూ.3360 నుంచి రూ.5880 వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే ఒక జీబీ డేటాకు రూ.20 నుంచి రూ.35వరకు చార్జి చేసే అవకాశం ఉంది.

తప్పు పడుతోన్న సీసీఐ
టెలికాం రంగం నుంచి వచ్చిన డిమాండ్ తర్వాత కాల్ మరియు డేటా సేవలకు కనీస ధరను నిర్ణయించడంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) సమాలోచనలు జరుపుతోంది. అయితే కాంపిటీన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పు పడుతుండటం గమనార్హం. ఇలాంటి చర్యలు తిరోగమనం అని.. ఇది మార్కెట్ పోటీపై హానికర ప్రభావం చూపుతుందని పేర్కొంది.
-
భారత్ వృద్ధికి రూ.2 లక్షల కోట్లు..కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
హోటల్ యజమానులకు గుడ్ న్యూస్.. సబ్సిడీలతో సర్కార్ బంపర్ ఆఫర్! -
ట్రంప్కు తలనొప్పి.. పుతిన్కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు












Click it and Unblock the Notifications