వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైల్లో కత్తులు, మొబైల్స్, సిమ్ కార్డులు స్వాధీనం

|
Google Oneindia TeluguNews

మంగళూరు: మంగళూరు సెంట్రల్ జైల్లో భారీగా మొబైల్స్, కత్తులు, సిమ్ కార్డులు బయటపడ్డాయి. ఖైదీలు విచ్చలవిడిగా మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నారని వెలుగు చూసింది. కర్ణాకటలోని మంగళూరు సెంట్రల్ జైలులో ఇంకా సోదాలు చేస్తున్నామని మంగళూరు నగర పోలీసు కమిషనర్ మురగన్ చెప్పారు.

గత సోమవారం ఉదయం 7.30 గంటల సమయంలో మంగళూరు సెంట్రల్ జైల్లో జరిగిన గ్యాంగ్ వార్ లో మాఫియా ముఠా సభ్యులు, కరుడుకట్టిన నేరస్తులు మాడూర్ యూసఫ్, అతని అనుచరుడు గణేష్ శెట్టి (దావూద్ అనుచరులు) హత్యకు గురైనారు.

Mobiles and Knives recover in Mangaluru Central Jail

విక్కి శెట్టి అనుచరులు కత్తులతో అతి దారుణంగా వీరిద్దరిని హత్య చేశారు. ఈ నేపథ్యంలోనే మంగళూరు సెంట్రల్ జైలులో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 10 కత్తులు, 16 మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, మొబైల్ బ్యాటరీలు, చార్జర్లు, ఎలక్ట్రికల్ వైర్లు, కారం పోడి స్వాధీనం చేసుకున్నారు.

ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని అధికారులు అంటున్నారు. మంగళూరు సెంట్రల్ జైల్లో కరుడుకట్టిన నేరస్తులు శిక్ష అనుభవిస్తున్నారు. జైలు సిబ్బంది సహకారం లేకుండా మారణాయుధాలు, మొబైల్ ఫోన్లు నేరస్తుల దగ్గరకు చేరే అవకాశం లేదని పోలీసు అధికారులు అంటున్నారు.

దర్యాప్తు కొనసాగుతున్నది అధికారులు తెలిపారు. అంతకు ముందు దుబాయ్ లో తలదాచుకున్న మాఫియా డాన్ విక్కి శెట్టి మంగళూరులోని విలేకరులకు ఫోన్ చేసి మాట్లాడాడు. తన టార్గెట్ యూసఫ్ అని, పొరబాటున గణేష్ శెట్టి గొడవలో అంతం అయ్యాడని వివరణ ఇచ్చుకున్నాడు.

English summary
Vicky Shetty called reporters in Mangalore and said the real target was Madur Yusuf, a hitman for the hard-line Islamist outfit, Popular Front of India, and that Ganesh Shetty was killed by mistake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X