అవినీతిపరులకు టైమ్ ఇవ్వాలా?: తేల్చి చెప్పిన మోడీ
న్యూఢిల్లీ: నల్లధనంపై ప్రతీ సామాన్యుడూ సైనికుడిలా పోరాడాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అవినీతి, నల్లధనంపై ఉమ్మడి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. పార్లమెంట్ భవన్లో శుక్రవారం జరిగిన 'న్యూ వెర్షన్ ఆఫ్ కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా' పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని 'మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్' పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. యువతలో రాజ్యాంగం పట్ల అవగాహన పెంచేందుకు ప్రత్యేక దినోత్సవం అవసరమని అభిప్రాయపడ్డారు.

మన జీవితాల్లో రాజ్యాంగానికి ప్రత్యేక స్థానముందని.. రాజ్యాంగాన్ని గుర్తుచేసుకుంటే అంబేడ్కర్ను స్మరించుకున్నట్లేనని చెప్పారు. ఆన్లైన్ సేవలని విస్తృతంగా వినియోగించుకోవాలని చెప్పారు.
వ్యాపార లావాదేవీలన్నీ మొబైల్ ఫోన్తోనే చక్కబెట్టుకోవచ్చని చెప్పారు. డిజిటల్ కరెన్సీని విరివిగా వాడుకోవాలన్నారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు పయనిద్దామన్నారు. పెద్ద నోట్ల రద్దును సమర్థిస్తూ.. తమ ప్రభుత్వం అవినీతిపరులకు సమయం ఇవ్వదని తేల్చి చెప్పారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications