ప్రధాని మోడీ మనస్తాపం, 12న నిరాహార దీక్ష: వారం తర్వాత నిద్రలేచాలని కాంగ్రెస్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరుపై ఇరువురు సమీక్షించారు.
పార్లమెంటులో విపక్షాల తీరుపై మనస్తాపం చెందిన ప్రధాని మోడీ వారి తీరుకు నిరసనగా ఒకరోజు దీక్ష చేయాలని నిర్ణయించారు. బీజేపీ ఎంపీలతో కలిసి ఈ నెల 12న నిరాహార దీక్ష చేస్తారు.
ప్రధాని నిర్ణయంపై కాంగ్రెస్ విమర్శలు
ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. పార్లమెంటు ముగిసిన వారం రోజుల తర్వాత మోడీ నిద్రలేచారని ఎద్దేవా చేసింది. అన్నాడీఎంకేతో పాటు ఇతర పార్టీల ఆందోళన కారణంగా రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో 23 రోజుల పాటు సభా కార్యక్రమాలు స్తంభించాయి.
తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఇతర పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీకు చర్చకు రాలేదు. టీఆర్ఎస్తో పాటు కావేరీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే నిరసనలు వ్యక్తం చేయడంతో సభ సజావుగా సాగలేదు.