మోడీ సౌదీ పర్యటనకు క్యార్ తుఫాను ముప్పు... విమానం ఆ రూట్లో వెళ్లగలదా..?
పాకిస్తాన్ తన బుద్ధిని ఇసుమంతైనా మార్చుకోలేదు. భారత ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనకు వెళుతున్నారు. ఇందుకోసం పాకిస్తాన్ గగనతలం మీదుగా విమానం ప్రయాణిస్తే తక్కువ సమయంలో సౌదీకి చేరుకుంటారు. కానీ మోడీ విమానం తమ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి నిరాకరించింది పాకిస్తాన్. దీంతో మోడీ బోయింగ్ విమానం 747 ప్రత్యామ్నాయ రూట్లలో ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో విమానం ఇంధనం, సమయం కూడా వృథా కానుంది.

మోడీ విమానం ఎగిరేందుకు అనుమతి ఇవ్వని పాక్
ప్రధాని నరేంద్రమోడీ విమానం పాకిస్తాన్ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో కొత్త రూట్లో ప్రయాణించనుంది. ఢిల్లీ నుంచి ముంబైకి దగ్గరగా వెళ్లి ఆ పై అరేబియా సముద్రం మీదుగా టర్న్ తీసుకుని రియాద్ వైపు వెళ్ళనుంది. అయితే అరేబియన్ సముద్రంలో క్యార్ తుఫాన్ ప్రభావం ఉన్నందున ఫ్లైట్ ప్లాన్లో మార్పులు జరిగే అవకాశం ఉంది.

విమానంకు క్యార్ తుఫాను ముప్పు
ఒకవేళ పాకిస్తాన్ గగనతలం మీదుగా విమానం ఎగిరి ఉంటే క్యార్ తుఫాను ముప్పు ఉండేది కాదు. ముంబై మీదుగా అయితే క్యార్ తుఫాను ముప్పు ఉంటుందని ఏవియేషన్ అధికారులు చెబుతున్నారు. ముంబైలోని అరేబియా సముద్రం మీదుగా వెళుతుందంటే సౌదీకి చేరుకునేందుకు 45 నిమిషాలు అదనంగా సమయం తీసుకుంటుందని చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ విమానం తమ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు పాకిస్తాన్ ఆదివారం వెల్లడించింది.

ఫ్లయిట్ ప్లాన్ మారే అవకాశం..?
భారత వాతావరణశాఖ నివేదిక ఇచ్చిన ప్రకారం క్యార్ తుఫాను క్రమంగా ఒమన్ తీరంవైపు కదులుతోంది. ముంగళవారం ఉదయం వరకు భారీ వర్షాలు మహారాష్ట్ర, కర్నాటక, గోవాల్లో కురుస్తాయని పేర్కొంది. ముంబై నైరుతీ తీరానికి 580 కిలోమీటర్ల దూరంలో క్యార్ తుఫాను కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీనికి అనుగుణంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రయాణించే ఫ్లయిట్ ప్లాన్ ఉంటుంది. ఇక సోమవారం రియాద్లో ప్రధాని మోడీ ల్యాండ్ అవుతారు. పర్యటనలో సౌదీ రాజు మొహ్మద్ బిన్ సల్మాన్తో భేటీ అవుతారు. ఆ తర్వాత మంగళవారం జరిగే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ ఫోరంలో పాల్గొంటారు.

రాష్ట్రపతి విమానంను కూడా అడ్డుకున్న పాక్
ఇదిలా ఉంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విదేశీ పర్యటన సందర్భంలో కూడా ఆయన ప్రయాణించాల్సిన విమానం తమ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి నిరాకరించింది. ఆ తర్వాత ప్రధాని అమెరికా పర్యటన సందర్భంగా కూడా తమ గగనతలంలో విమానం ఎగిరేందుకు పాక్ నిరాకరించింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications