ఒడిశాలో ప్రధాని మోడీ.. ఫొని ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే..
భువనేశ్వర్ : ఫొని తుఫాను కారణంగా అతలాకుతలమైన ఒడిశాలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన కొనసాగుతోంది. తొలుత సీఎంతో సమావేశమైన ప్రధాని అనంతరం ఏరియల్ సర్వే ద్వారా తాజా పరిస్థితిని తెలుసుకోనున్నారు. ఆ తర్వాత తాజా పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తుఫాను కారణంగా అల్లకల్లోలంగా మారిన ఒడిశాకు మోడీ భారీ మొత్తంలో ఆర్థికసాయం ప్రకటించే అవకాశముంది.
ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని బిజూ పట్నాయక్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీకి గవర్నర్ గనేషీ లాల్, సీఎం నవీన్ పట్నాయక్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాని స్వాగతం పలికారు. అనంతరం సీఎంతో భేటీయై వరద పరిస్థితిపై చర్చించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలైన పూరీ, కుర్దా, కటక్, జగత్సింగ్పూర్, జాజ్పూర్, కేంద్రపారా, భద్రక్, బాలాసోర్ జిల్లాల్లో పరిస్థితిని మోడీ ఏరియల్ సర్వే ద్వారా తెలుసుకోనున్నారు. తిరుగు ప్రయాణంలో ఎయిర్పోర్టులోనే ఆయన ఒడిశా ప్రభుత్వ అధికారులతో రివ్యూ నిర్వహించి సహాయక, పునరావాస కార్యక్రమాలపై చర్చించనున్నారు.
PM Narendra Modi conducts aerial survey of #Cyclonefani affected areas in Odisha. Governor Ganeshi Lal, CM Naveen Patnaik and Union Minister Dharmendra Pradhan also present. pic.twitter.com/ZO9XkRC7kK
— ANI (@ANI) May 6, 2019

-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications