ట్రంప్ అంగీకరించేలా మోడీ చేశారు: హెచ్1బిపై సుష్మా
ఇటీవల అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్తో హెచ్1బి వీసాల అంశం గురించి మాట్లాడలేదన్న విమర్శలపై కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ గురువారం రాజ్యసభలో స్పందించారు.
న్యూఢిల్లీ: ఇటీవల అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్తో హెచ్1బి వీసాల అంశం గురించి మాట్లాడలేదన్న విమర్శలపై కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ గురువారం రాజ్యసభలో స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను ఆమె తోసి పుచ్చారు. కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా సుష్మ మాట్లాడారు.

హెచ్1బి వీసా అనే పదాన్ని ఉపయోగించకుండా దాని గురించి మోడీ, ట్రంప్ల మధ్య సవివరమైన చర్చ జరిగిందన్నారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇండియన్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ మహోన్నత సేవలు అందిస్తున్నట్లు ట్రంప్ అంగీకరించేలా మోడీ చేయగలిగారన్నారు. అందుకు గర్విస్తున్నామని సుష్మా అన్నారు.












Click it and Unblock the Notifications