మాన్సూన్ అప్డేట్స్: ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లో భారీ వర్షాలు
న్యూఢిల్లీ: అల్పపీడనం మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణికుస్తున్న కారణంగా హర్యానా, ఛండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
అల్పపీడనం ప్రభావంతో దక్షిణ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్ర మట్టానికి 5.8కి.మీ.పై తుఫాను వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.

మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో ఐదురోజులపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు రాజస్థాన్ ప్రాంతంలో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Recommended Video


బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటి వరకు 40శాతం వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్ 48శాతం, జార్ఖండ్లో 46శాతం వర్షాలు తక్కువగా కురిశాయి.












Click it and Unblock the Notifications