మోడీ 4ఏళ్ల పాలన-మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే: ఎన్డీయేకు 274, యూపీఏకు 164 సీట్లు, మోడీకి అక్కడ దెబ్బ
న్యూఢిల్లీ: మూడున్నర దశాబ్దాల తర్వాత 2014లో పూర్తిస్థాయి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి 2019 లోకసభ ఎన్నికలు ఎంతో కీలకం. గత నాలుగేళ్లుగా ఒకటి రెండు వైఫల్యాలు మినహా మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో జెండా పాతింది. ఇలాంటి సమయంలో వైరి పక్షాలు ఏకమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఏబీపీ - సీఎస్డీఎస్ సర్వే చేసింది. ఏయే రాష్ట్రాల్లో పరిస్థితి బీజేపీ లేదా మోడీ నాలుగేళ్ల పాలనపై ఎలా ఉంది? తిరిగి 2019లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా అంటే ఈ సర్వే ద్వారా మనకు కొంత అవగాహన రానుంది.

ఏబీపీ సర్వే ప్రకారం.. మోడీకి క్రేజ్ కాస్త తగ్గినా దేశంలో ఇప్పటికీ మోడీ పాపులారిటీయే ఎక్కువ. 2017లో మోడీ పాపులారిటీ 44 శాతంగా ఉండగా, 2018 జనవరిలో అది 37 శాతానికి తగ్గింది. ప్రస్తుతం 34 శాతానికి పడిపోయింది. 2017 మేలో రాహుల్ గాంధీ పాపులారిటీ 15 శాతంగా ఉండగా, 2018 మే నాటికి 24 శాతానికి పెరిగింది.
మధ్య భారతం, పశ్చిమ భారత దేశంలో 114 లోకసభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ 70 నుంచి 78 సీట్లు గెలుచుకోనుంది. 2014లో బీజేపీ ఇక్కడ 108 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు ముప్పై సీట్ల వరకు తగ్గుతున్నాయి. 2014లో యూపీఏ 10 సీట్లు గెలుచుకుంది. కానీ ఇప్పుడు 41 సీట్ల నుంచి 47 సీట్లు గెలుచుకోనుంది. ఇతరులు 2014లో ఏమీ గెలుచుకోలేదు. ఇప్పుడు 0-2 సీట్లు గెలుచుకోనున్నారు.
గుజరాత్లో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 54 శాతం ఓట్లు, యూపీఏకు 42 శాతం
ఓట్లు, ఇతరులకు 4 శాతం ఓట్లు వస్తాయని ఏబీపీ సర్వేలో వెల్లడైంది. 2014 సార్వత్రిక
ఎన్నికల్లో బీజేపీకి 59 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 54 రానున్నాయి. అంటే 5 శాతం
తగ్గనుంది. గుజరాత్లో కాంగ్రెస్కు 2014లో 33 శాతం రాగా, ఇప్పుడు 42 శాతం ఓట్లు
రానున్నాయి. అంటే 9 శాతం పెరిగింది.
ఏబీపీ సర్వే ప్రకారం మహారాష్ట్రలో ఎన్డీయేకు 48 శాతం, యూపీఏకు 40 శాతం, ఇతరులకు 12 శాతం ఓట్లు రానున్నాయని ఏబీపీ సర్వే తెలిపింది. 2014లో ఎన్డీయేకు 51 శాతం రాగా ఇప్పుడు 48 శాతం రానుంది. 3 శాతం ఓట్లు తగ్గనున్నాయి. అదే సమయంలో యూపీఏకు 2014లో 35 శాతం ఓట్లు రాగా ఇప్పుడు 40 శాతం రానున్నాయి. ఐదు శాతం ఓట్లు ఎక్కువగా రానున్నాయి.
శివసేన వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కాకుండా ఒంటరిగా పోటీ చేయనుంది. అయితే శివసేనతో కలిస్తే బీజేపీకి ఎంత లాభమంటే 2014లో 27 శాతం కాగా, ఇప్పుడు 29 శాతంగా ఉంది. రెండు శాతం ఎక్కువే ఉంది. కానీ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసే అవకాశాలున్నాయి.
ఈశాన్య ప్రాంతంలో బీజేపీ హవా....
ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ హవా కనిపించనుందని ఈ సర్వేలో వెల్లడైంది. ఇక్కడ 142 స్థానాలు ఉండగా ఎన్డీయే 86 నుంచి 94 మధ్య, యూపీఏ 22 నుంచి 26 సీట్లు గెలుచుకోనుందని వెల్లడించింది. ఇతరులు 26 నుంచి 30 గెలవనున్నారు. 2018లో ఎన్డీయే 58, యూపీఏ 21, ఇతరులు 61 స్థానాలు దక్కించుకున్నారు.
పశ్చిమ బెంగాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 65 శాతం ఓట్లు సాధిస్తాయని సర్వే వెల్లడించింది. 2014 కంటే బీజేపీ మాత్రం ముందంజలో ఉండనుంది. 2014లో ఎన్డీయే 17 శాతం ఓట్లు సాధించింది. ఇప్పుడు 24 శాతం ఓట్లు సాధిస్తుందని తేలింది.
More From
-
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications