మోడీ 4ఏళ్ల పాలన-మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే: యూపీలో బీజేపీకి ఘోర పరాభవమే, ఎస్పీ-బీఎస్పీకి 53 శాతం
న్యూఢిల్లీ: మూడున్నర దశాబ్దాల తర్వాత 2014లో పూర్తిస్థాయి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి 2019 లోకసభ ఎన్నికలు ఎంతో కీలకం. గత నాలుగేళ్లుగా ఒకటి రెండు వైఫల్యాలు మినహా మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో జెండా పాతింది. ఇలాంటి సమయంలో వైరి పక్షాలు ఏకమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఏబీపీ - సీఎస్డీఎస్ సర్వే చేసింది. ఏయే రాష్ట్రాల్లో పరిస్థితి బీజేపీ లేదా మోడీ నాలుగేళ్ల పాలనపై ఎలా ఉంది? తిరిగి 2019లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా, కాంగ్రెస్ ఏ మేర పుంజుకుంది అనేది ఈ సర్వే ద్వారా వెల్లడించారు.

ఉత్తర ప్రదేశ్లో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది?
2019 లోకసభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లో బీజేపీ కంటే ఎస్పీ, బీఎస్పీ మిత్రపక్షాలు ఎక్కువ ఓట్లు, సీట్లు గెలుచుకునే పరిస్థితి ఉంది. ఏబీపీ సర్వే ప్రకారం ఎస్పీ-బీఎస్పీలు కలిస్తే 53 శాతం ఓట్లను (రెండు పార్టీల ఓట్లు) దక్కించుకోనున్నాయి. ఎన్డీయే 35 శాతం ఓట్లు, యూపీఏ 12 శాతం ఓట్లు దక్కించుకోనున్నాయి.
ఉత్తర భారత దేశంలో బీజేపీ గతంలో కంటే వెనుకబడింది. ఉత్తర ప్రదేశ్ వంటి కీలక రాష్ట్రాల్లో ఆ పార్టీకి 2018 ఆరంభం నుంచి 8 శాతం ఓట్లు తగ్గాయని సర్వేలో వెల్లడైంది. ఎస్పీ, బీఎస్పీల కలయిక వల్ల ఆ పార్టీలకు 4 శాతం ఓట్లు పెరగనున్నాయని సర్వేలో తేలింది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications