Jammu & Kashmir Assembly Election 2024: జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంతంగా ముగిసిన మూడో దశ పోలింగ్..
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం మూడో దశ పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 5 గంటల వరకు 65.5 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తెలుస్తోంది. మొత్తం 90 సీట్లు ఉన్న జమ్మూకాశ్మీర్ మూడు దఫాలుగా ఎన్నికలు నిర్వహించారు. మొదటి దశ సెప్టెంబర్ 18న జరిగింది. తొలి దఫాలో 65.4 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక రెండో దశ సెప్టెంబర్ 25 జరిగింది. రెండో దఫాలో 57.31 ఓటింగ్ శాతం నమోదు అయింది.
చివరి దశ ఈ రోజు జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని ఏడు జిల్లాల్లోని 40 అసెంబ్లీ సెగ్మెంట్లలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మూడో దశలో 415 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు తారా చంద్, ముజఫర్ బేగ్, పలువురు మాజీ మంత్రులు పోటీలో ఉన్నారు. ఉధంపూర్ జిల్లాలో అత్యధికంగా 72.91% పోలింగ్ నమోదు కాగా. సాంబా 72.41, కథువా 70.53, జమ్ము 66.79, బండిపోరా 63.33, కుప్వారా 62.76, బారాముల్లా 55.73 శాతం పోలింగ్ నమోదైంది.

జమ్మూ జిల్లాలోని 11 సెగ్మెంట్లలో బిష్నా (SC) 72.75%, సుచేత్గఢ్ (SC) 68.02%, R S పురా-జమ్ము సౌత్ 61.65%, బహు 57.07%, జమ్మూ ఈస్ట్ 60.21%, జమ్ము 731%, జమ్ము 62.94%, పశ్చిమ 62.94 శాతం పోలింగ్ నమోదు అయింది. ఉధంపూర్ జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లలో ఉదంపూర్ వెస్ట్లో 73.20%, ఉధంపూర్ ఈస్ట్లో 74.07%, చెనానిలో 73.79%, రామ్నగర్ (ఎస్సీ) 70.38% పోలింగ్ నమోదైంది.
బారాముల్లా జిల్లాలోని ఏడు స్థానాల్లో సోపోర్ 41.44%, రఫియాబాద్ 58.39%, ఉరి 64.81%, బారాముల్లా 47.95%, గుల్మార్గ్ 64.19%, వాగూరా-క్రీరీ 56.43%, పట్టాన్ 60.87% నమోదయ్యాయి. అక్టోబర్ 8న ఫలితాలు విడుదల చేయనున్నారు. జమ్మూ కాశ్మీర్ లో 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు చేశారు. అప్పటి నుంచి అక్కడ ఎన్నికలు జరగలేదు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications