వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిద్రపోయే మంత్రులకు కనువిప్పు: ఫేస్‌బుక్‌లో వైరల్‌‌లా మహిళా బ్యాంక్ ఉద్యోగిని పోస్ట్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

పూణె: బ్యాంక్‌ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ వృత్తిలో భాగంగా పనిచేస్తూనే మరో పక్క తన బిడ్డను చూసుకుంటూ ఉన్న ఓ ఫోటో ఇప్పుడు ఫేస్‌బుక్‌లో వైరల్‌లా మారింది. తన బిడ్డకు ఒళ్లు కాలిపోయే జ్వరం ఉన్నా తన వెంట ఉద్యోగానికి తీసుకెళ్లి నేల మీద పడుకోబెట్టుకుని తన కొడుకుని చూసుకుంది ఆ కన్న తల్లి.

ప్రజల శ్రేయస్సును పట్టించుకోకుండా అసెంబ్లీలో నిద్రపోతున్న మంత్రులకు కనువిప్పు కలగాలని ఈ ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. ఇప్పుడు ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఫోటోను ఇప్పటివరకు ఇరవై రెండు వేల మంది షేర్ చేశారు.

వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని పూణెకు చెందిన స్వాతి చితల్కర్‌ అనే మహిళ సిండికేట్‌ బ్యాంక్‌లో పనిచేస్తుంది. ఆమె కొడుక్కి విపరీతంగా జ్వరం వచ్చింది. దీంతో బ్యాంకు నుంచి అత్యవసరంగా రావాలని పిలుపు రావడంతో బాబును తీసుకొని బ్యాంకుకు వెళ్లింది.

ఫేస్‌బుక్‌లో వైరల్‌‌లా మహిళా బ్యాంక్ ఉద్యోగిని పోస్ట్

ఫేస్‌బుక్‌లో వైరల్‌‌లా మహిళా బ్యాంక్ ఉద్యోగిని పోస్ట్

ఆమె సీటు వెనుక నేలపై బాబును పడుకోబెట్టి తన పని చేసుకుంది. దీనికి సంబంధించిన విషయాన్ని మొత్తం ఆమె తన ఫేస్ బుక్‌లో పోస్ట్‌ చేసింది.

ఫేస్‌బుక్‌లో వైరల్‌‌లా మహిళా బ్యాంక్ ఉద్యోగిని పోస్ట్

ఫేస్‌బుక్‌లో వైరల్‌‌లా మహిళా బ్యాంక్ ఉద్యోగిని పోస్ట్

ఆమె తన ఫేస్‌బుక్‌లో నేను కింద పడుకోబెట్టింది నా కొడుకుని కాదు. నా హృదయాన్ని.

ఫేస్‌బుక్‌లో వైరల్‌‌లా మహిళా బ్యాంక్ ఉద్యోగిని పోస్ట్

ఫేస్‌బుక్‌లో వైరల్‌‌లా మహిళా బ్యాంక్ ఉద్యోగిని పోస్ట్

బ్యాంకులో మంజూరు చేయాల్సిన లోన్స్ ఉన్నాయని సెలవు ఇవ్వక పోవడంతో తన కొడుకుని తీసుకొని బ్యాంకుకు వెళ్లవలసి వచ్చింది.

ఫేస్‌బుక్‌లో వైరల్‌‌లా మహిళా బ్యాంక్ ఉద్యోగిని పోస్ట్

ఫేస్‌బుక్‌లో వైరల్‌‌లా మహిళా బ్యాంక్ ఉద్యోగిని పోస్ట్

కాని నేను ఇటు తల్లిగా, ఉద్యోగినిగా రెండు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలిగాను. దీని వల్ల మంత్రులకు ఓ సందేశాన్ని ఇస్తున్నాను.

ఫేస్‌బుక్‌లో వైరల్‌‌లా మహిళా బ్యాంక్ ఉద్యోగిని పోస్ట్

ఫేస్‌బుక్‌లో వైరల్‌‌లా మహిళా బ్యాంక్ ఉద్యోగిని పోస్ట్

అసెంబ్లీలో నిద్రపోయే మంత్రులారా ఇప్పటికైనా మేల్కొండి అంటూ పోస్ట్‌ చేసింది. నా సహ ఉద్యోగులు ఈ విషయంపై ఎంతో ప్రోత్సహించారు.

ఫేస్‌బుక్‌లో వైరల్‌‌లా మహిళా బ్యాంక్ ఉద్యోగిని పోస్ట్

ఫేస్‌బుక్‌లో వైరల్‌‌లా మహిళా బ్యాంక్ ఉద్యోగిని పోస్ట్

వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆమె అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ పూణెలో అగ్రికల్చర్ సైన్సులో స్వాతి చితల్కర్‌ పట్టా పొందారు.

ఫేస్‌బుక్‌లో వైరల్‌‌లా మహిళా బ్యాంక్ ఉద్యోగిని పోస్ట్

ఫేస్‌బుక్‌లో వైరల్‌‌లా మహిళా బ్యాంక్ ఉద్యోగిని పోస్ట్

తన ఫేస్‌బుక్ పోస్ట్ వైరల్‌లా మారడంతో ఆమె ఎంతో ఆశ్చర్యానికి గురయ్యానని, కేవలం ఒకే ఒక్క సింపుల్ పోస్ట్‌తో ఇండియాతో పాటు విదేశాల నుంచి కూడా తనకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వస్తున్నాయని అన్నారు.

ఫేస్‌బుక్‌లో వైరల్‌‌లా మహిళా బ్యాంక్ ఉద్యోగిని పోస్ట్

ఫేస్‌బుక్‌లో వైరల్‌‌లా మహిళా బ్యాంక్ ఉద్యోగిని పోస్ట్

ఎందుకు? నా మనసులో ఏదైతో ఉందో దానిని మాత్రమే తాను పోస్టులో పేర్కొన్నానని ఆమె తెలిపారు.

English summary
A picture of a working mother with her baby lying on the floor by her side is going viral on Facebook. The woman in the picture is Swati Chitalkar, who works at Syndicate Bank in Pune.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X