వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కట్నం కోసం హంగామా: పెళ్లి రద్దు చేసిన వధువు

|
Google Oneindia TeluguNews

భోపాల్: అదనపు కట్నం కోసం పెళ్లికొడుకు, అతని కుటుంబసభ్యులు చేసిన హంగామాని సహించలేక పోయింది ఆ నవ వధువు. అందుకే.. ఏకంగా తెల్లారి జరగబోయే పెళ్లిని రద్దు చేసుకుంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మోహగాన్‌ పట్టణానికి చెందిన మాల్కాన్‌ సింగ్‌ తన కుమార్తె మీనాక్షికి మనీష్‌ అనే యువకుడితో పెళ్లి నిశ్చయించారు. తెల్లవారితే పెళ్లనగా.. పెళ్లికొడుకు తల్లిదండ్రులు మద్యం తాగి అదనంగా మరో రూ.రెండులక్షల కట్నం ఇవ్వాలంటూ అడగటం మొదలుపెట్టారు.

MP bride stands up against dowry demands, sends marriage party packing

అంతేగాకుండా వధువు తల్లిదండ్రులపై చెయ్యి చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఆ యువతి తనకు ఈ పెళ్లి వద్దంటూ తేల్చిచెప్పింది. అనంతరం తన తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వరుడి కుటుంసభ్యులపై ఫిర్యాదు చేసింది.

వరుడి కుటుంబసభ్యులు అడిగిన కట్నం ఇచ్చేందుకు తమ తల్లిదండ్రులు అంగీకరించారని, అయినా అదనపు కట్నం కోసం వరుడు, అతని కుటుంబసభ్యులు వేధింపులకు గురిచేశారని నవ వధువు ఫిర్యాదు చేసినట్లు డీఎస్పీ విమల్ కుమార్ జైన్ తెలిపారు. ఆ వధువు ధైర్యంగా పెళ్లి రద్దు చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిందని అన్నారు. వరుడి కుటుంబసభ్యులపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

English summary
Enraged over the dowry demands and misbehaviour meted out to her family by her future-in-laws, a woman in Mehgaon town here called off her wedding and forced the marriage party to go back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X