కాల్గర్ల్ను బెదరించి దోపిడీ చేసిన ఎంపి కొడుకు
ముంబై: ఓ పార్లమెంటు కుమారుడు అయి ఉండి దొంగతనానికి పాల్పడ్డాడు. అదేదో ఏటిఎంలోనో, బ్యాంకులోనే, ఇంట్లోనో కాదు.. ఓ కాల్గర్ల్ను బెదిరించి ఆమె వద్ద ఉన్న డబ్బును ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది.
వకోలా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ ఎంపీ కొడుకు సబర్బన్ సాంటా క్రూజ్ సమీపంలో కాల్గర్ల్ నుంచి ఏకంగా రూ.1.50లక్షలు ఎత్తుకెళ్లాడు.
ఆగస్టు 16న అర్థరాత్రి కాల్గర్ల్ తన పనిని ముగించుకుని వస్తున్న సమయంలో ఎంపీ కుమారుడు ఆమెను అడ్డుకుని కత్తితో బెదిరించి డబ్బులు దోచుకున్నాడు. ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు పిర్యాదు చేసింది.
ఆమె మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దోపిడీ చేసిన సమయంలో నిందితుడితోపాటు మరో యువతి ఉన్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కాగా, ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి తండ్రి అయిన ఆ పార్లమెంటు సభ్యుడి పేరు మాత్రం బయటికి రాలేదు.