పెళ్లి చేసుకుంటానని.. హోటల్ తీసుకెళ్లి రేప్ చేశాడు
అనుకోకుండా కలిసిన ఫోన్ కాల్ ద్వారా నిందితుడు మహ్మద్ అస్లాం(40) 21ఏళ్ల యువతికి పరిచయమయ్యాడు. గత ఆరు నెలల(మార్చి) నుంచి ఆమెకు తరచూ ఫోన్ చేసి మాట్లాడుతూ ఆ యువతితో పరిచయం పెంచుకున్నాడు నిందితుడు. ఆ తర్వాత రోజూ మాట్లాడటం ప్రారంభించారు.
పరిచయం పెరగడంతో నిందితుడు అస్లాం మహారాష్ట్రలోని ముంబైలో ఉంటున్న యువతిని కలిశాడు. ముంబైలోని పలు ప్రాంతాలను ఇద్దరూ కలిసి సందర్శించారు. దీంతో అతడు మంచివాడని యువతి నమ్మింది. జైపూర్ రావాలని యువతిని కోరాడు మహ్మద్ అస్లాం. దీంతో ఆగస్టు 3న యువతి జైపూర్కు వచ్చింది. ఓ ఆటోను తీసుకుని జల్మహల్ వద్దకు రావాలని ఆమెకు చెప్పాడు అస్లాం. అక్కడికి రావడంతో ఆమెను తీసుకుని జైపూర్లోని వివిధ ప్రాంతాలను చూపించాడు.
ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పాడు. ఓ హోటల్కు తీసుకెళ్లి ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతడు అక్కడ్నుంచి పరారయ్యాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న యువతి బ్రహ్మపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.