చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నైకి గుండెను పంపించిన ముంబై: 1300కి.మీ.., ప్రాణం నిలబడింది

ఇందుకోసం చేతన్ గుండె ముంబై నుంచి చెన్నై వరకు ఏకంగా 1300కి.మీ ప్రయాణించడం విశేషం.

|
Google Oneindia TeluguNews

ముంబై: మునుపటితో పోల్చితే అవయవదానంపై ప్రజల్లో చాలా మేరకు అవగాహన పెరిగింది. రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్ అయిన తమవారి అవయవాలను మరొకరికి దానం చేసేందుకు వారు ముందుకొస్తున్నారు.

తాజాగా ముంబైలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి గుండెను దానం చేసేందుకు అతని కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో ఏకంగా 1300కి.మీ దూరం దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి విజయవంతంగా మరొకరికి అమర్చారు.

Mumbai sends heart to Chennai

వివరాల్లోకి వెళ్తే..నేవీ ముంబైకి చెందిన చేతన్‌ టేలర్‌ అనే ఓ చిరు వ్యాపారి ఇటీవల తీవ్ర అస్వస్థతతో 20రోజుల క్రితం అపోలో ఆసుపత్రిలో చేరాడు. మెదడులో రక్తస్రావం కారణంగా అతని బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు గుర్తించారు. ఇదే విషయాన్ని చేతన్ భార్య, పిల్లలకు చెప్పి అతని గుండెను దానం చేయించేందుకు ఒప్పించారు.

అలా చేతన్ గుండెను చెన్నైలో చికిత్స పొందుతున్న లెబనాన్‌కు చెందిన 61 ఏళ్ల వ్యాపారవేత్తకు అమర్చారు. ఇందుకోసం చేతన్ గుండె ముంబై నుంచి చెన్నై వరకు ఏకంగా 1300కి.మీ ప్రయాణించడం విశేషం. ముంబై ఆసుపత్రి నుంచి గుండెను తరలించే క్రమంలో అధికారులు ఎక్కడిక్కడ ట్రాఫిక్‌ను నియంత్రించడంతో కేవలం 40 నిమిషాల్లో గుండెను ముంబై ఎయిర్ పోర్ట్‌కు చేర్చారు.

ఆపై ముంబై ఎయిర్ పోర్టు నుంచి చార్టెడ్‌ విమానంలో కేవలం నాలుగు గంటల్లో చెన్నైలోని ఫోర్టిస్‌ ఆస్పత్రికి తీసుకొచ్చి విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశారు.

English summary
n a first for the city, the heart of a 43-year-old Khopoli resident, who was declared brain dead, was flown to Chennai on Thursday where a 61-year-old patient from Lebanon was awaiting a heart transplant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X