అద్దె ఇంటి కోసం వెళితే! భర్తను బంధించి, భార్యపై గ్యాంగ్రేప్
ముంబై: మహారాష్ట్రలోని అంబోలీ ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అద్దె ఇంటి కోసం వెళ్లిన దంపతులపై దాడి చేసిన దుండగులు, భర్తను బంధించి.. భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. అంబోలీ ప్రాంతంలో అద్దె ఇంటి కోసం ఓ దంపతులు వెతుకున్నారు. అదే సమయంలో ఖాళీగా ఉన్న ఓ ఇంటిని చూసేందుకు ఆమె లోపలికి వెళ్లింది.
ఆ సమయంలో ఇల్లు చూపించేందుకు లోపలికి వచ్చిన వారిలో ముగ్గురు ఆమె భర్తను బయటే నిర్బంధించగా.. మరో నలుగురు ఆమెపై అదే ఇంట్లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా, మహారాష్ట్రలోని జవహర్ తాలూకాలో మరో దారుణం చోటు చేసుకుంది. తాను ప్రేమించిన అమ్మాయి(14) తనను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోవడం లేదని కోపం నీలేష్ అనే యువకుడు ఆమెను దారుణంగా నరికి చంపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.