అమ్మాయిని 4గురు రేప్ చేసి, నెట్లో వీడియో పెట్టారు
లక్నో: ఉత్తర ప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. 17 ఏళ్ల అమ్మాయిని నలుగురు రేప్ చేశారు. దానిని వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ సంఘటన ముజఫర్ నగర్లోని న్యూ మండి ప్రాంతంలో చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
ఈ సంఘటన మూడు రోజుల క్రితం జరిగిందని, ఇందుకు సంబంధించి ఆదివారం నాడు కేసు నమోదు చేసుకున్నామని, బాధిత అమ్మాయి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసారని పోలీసులు తెలిపారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. నలుగురు యువకులు (సిద్ధార్థ్, అంకిత్, మొంటి, అతుల్ కుమార్) అమ్మాయిని ఎత్తుకెళ్లారు. ఓ ఫ్లాట్కు తీసుకు వెళ్లి అక్కడ అత్యాచారానికి పాల్పడ్డారు. దానిని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ తర్వాత దానిని ఇంటర్నెట్లో పెట్టారు.
ఈ విషయం అమ్మాయికి తెలిసిందని, ఎవరికైనా చెబితే చంపేస్తామని ఆమెను బెదిరించారని పోలీసులు తెలిపారు. దీంతో మిన్నకుండిపోయారని చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని చెప్పారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు.