మోడీ పంచ్ డైలాగ్ : "నా చాయ్ అంత స్ట్రాంగ్గా నిర్ణయాలుంటాయ్"
ఘాజిపూర్ : సందర్బం వచ్చిన ప్రతీసారి.. వేదికల మీద తన చాయ్ వాలా జిందగీని గుర్తుచేసుకునే ప్రధాని మోడీ.. తాజాగా ఓ పంచ్ డైలాగ్ తో జనాలను కట్టిపడేశారు. తన ఛాయ్ అంత స్ట్రాంగ్ గా తన నిర్ణయాలు ఉంటాయని ప్రకటించి తన వాక్చాతుర్యాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. మోడీ కొట్టిన ఈ పంచ్ డైలాగ్ కు జనం నుంచి పెద్ద ఎత్తున కేకలు అరుపులు వినబడ్డాయి.
సోమవారం నాడు ఉత్తరప్రదేశ్ లోని ఘాజిపూర్ లో నిర్వహించిన బీజేపీ పరివర్తన ర్యాలీ సందర్బంగా ప్రసంగించిన మోడీ.. తన చాయ్ వాలా రోజులను గుర్తు చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు.
'ప్రధాని అంటే రాజు.. హిట్లర్ కాదు, రూ.2000 నోటుతో నల్లధనంకు మోడీ అండ'
తాను రైల్వే ఫ్లాట్ ఫాం మీద ఛాయ్ లు అమ్ముకునే రోజుల్లో చాలామంది స్ట్రాంగ్ చాయ్ కావాలంటూ అడిగేవారని, అప్పటి ఛాయ్ అంత స్ట్రాంగ్ గా ప్రస్తుతం తన నిర్ణయాలు ఉంటాయని చెప్పారు.
రూ.2.50లక్షలు జమ చేసుకున్నవారిని అధికారులు ఏమి అనబోరని, కానీ 2.5కోట్లు దాచుకున్నవారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఇళ్లల్లో మంచాల పరుపుల కింద దాచిపెట్టుకున్నా వదిలేది లేదని పేర్కొన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని సామాన్యులు స్వాగతిస్తుంటే.. నల్లకుబేరులకు మాత్రం కంటి మీద కునుకు కరువయ్యిందన్నారు. నోట్ల రద్దుతో అవినీతిపరులే ఎక్కువగా ఇబ్బందిపడుతున్నారని అభిప్రాయపడుతున్నారు.