Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Mysuru girl: అమ్మాయిలా, ఆంటీలా కాదు, ఆడది కనపడితే వదల్లేదు, ఇది తమిళ తంబీల హిస్టరీ !

బెంగళూరు/ మైపూరు/ చెన్నై: మైసూరు వచ్చిన ప్రతిసారి మేము రేప్ లు చేస్తాము, దారి దోపిడీలు చేస్తాము, ఇది పోలీసుల విచారణలో అరెస్టు అయిన కామాంధులైన తమిళ తంబీలు ఇచ్చిన స్టేట్ మెంట్ అని వెలుగు చూడటంతో స్థానికులు బిత్తరపోయారు. మేము వచ్చిన వేళా విశేషం ఇంతకాలం బాగుంది. ఇప్పుడు మాకు ప్లాన్ రివర్స్ అయ్యిందని మైసూరు గ్యాంగ్ రేప్ కేసులో అరెస్టు అయిన నిందితులు చెప్పారని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పడంతో స్థానికంగా నివాసం ఉంటున్న వివాహిత మహిళలు, యువతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో కామాంధులు అత్యాచారం చెయ్యడంతో విషయం బయటకు తెలిస్తే మా పరువు పోతుందని, మా జీవితాలు నాశనం అవుతాయని చాలా మంది బాధితులు బయటకు చెప్పకపోవడంతో వీరి ఆగడాలు ఇంతకాలం వెలుగు చూడలేదని పోలీసులు అంటున్నారు. మాకు వయసుతో పని లేదు, ఆంటీలు అయినా అమ్మాయిలు అయినా మేము ఆలోచించము, ఆడది కనపడిందా మా పని మేము చేసుకోని పోతామని టెంపర్ సినిమాలో లాగా కామాంధులు డైలాగులు చెప్పారని తెలిసింది. తమిళనాడు నుంచి అరటికాయల లోడ్ తీసుకుని వచ్చిన కామాంధులు మందు పార్టీ చేసుకోవడానికి మైసూరు సమీపంలోని అటవి ప్రాంతంలోకి వెళ్లి అదే సమయంలో అటువైపు వచ్చిన ప్రేమికులను పట్టుకుని దారుణం చేశారని పోలీసులు అంటున్నారు.

గత రెండు సంవత్సరాల నుంచి మేము మైసూరు వచ్చిన ప్రతిసారి రేప్ లు, దారి దోపీడీలు చేశామని పోలీసు కస్టడీలో ఉన్న నిందితులు అంగీకరించడంతో రహస్య ప్రాంతంలో వారిని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇన్ని రోజులు మైసూరు కాలేజ్ అమ్మాయి మీద ఆరు మంది గ్యాంగ్ రేప్ చేశారని ప్రచారం జరిగింది. అయితే మేము ఆరు మంది కాదు ఏడు మంది ? కాలేజ్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేశామని, ఇక్కొక్కడు ఉన్నాడని నిందితులు అంగీకరించడంతో ఇప్పుడు తప్పించుకుని తిరుగుతు ఇద్దరి కోసం కర్ణాటక పోలీసులు తమిళనాడు, మైసూరులో కామాంధుల కోసం గాలిస్తున్నారు.

 కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్ కేసు నిందితులు వీళ్లే

కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్ కేసు నిందితులు వీళ్లే

మైసూరులోని ప్రముఖ కాలేజ్ లో ఎంబీఏ చదువుతున్న ముంబాయికి చెందిన కాలేజ్ అమ్మాయి మీద ఆగస్టు 24వ తేదీ రాత్రి చాముండి కొండ సమీపంలోని లలితాద్రిపురం సమీపంలో గ్యాంగ్ రేప్ జరిగిన విషయం తెలిసిందే. వీరప్పన్ అడ్డా అయిన సత్యమంగలం జిల్లాలోని తిరుప్పూర్ తో పాటు పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న భూపతి (25), మురగేషన్ (22), ప్రకాష్ అలియాస్ అరవింద్ (21)తో పాటు 17 సంవత్సరాల మరో కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు.

 పోలీసుల కస్టడీలో మతిపోయే హిస్టరీ

పోలీసుల కస్టడీలో మతిపోయే హిస్టరీ

తమిళనాడుకు చెందిన ఐదు మంది మంది నిందితులను పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. దేశవ్యాప్తంగా కలకలం రేపింది ఎంబీఏ విద్యార్థి గ్యాంగ్ రేప్ కేసులో పూర్తి సమాచారం తెలుసుకోవడానికి నిందితులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయమూర్తి ముందు మనవి చేశారు. నిందితులను 10 రోజుల పాటు విచారణ చెయ్యడానికి న్యాయమూర్తి పోలీసులకు అనుమతి ఇచ్చారు. పోలీసుల విచారణలో మతిపోయే విషయాలు నిందితులు బయటకు చెప్పారని వెలుగు చూసింది.

మైసూరుకు ఎందుకు వచ్చారు ?, ఏం చేశారు

మైసూరుకు ఎందుకు వచ్చారు ?, ఏం చేశారు

తమిళనాడు నుంచి అరటికాయల లోడ్ తీసుకుని వచ్చిన కామాంధులు మందు పార్టీ చేసుకోవడానికి మైసూరు సమీపంలోని అటవి ప్రాంతంలోకి వెళ్లి అదే సమయంలో అటువైపు వచ్చిన ప్రేమికులను పట్టుకుని దారుణం చేశారని పోలీసులు అంటున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి మేము మైసూరు వచ్చిన ప్రతిసారి రేప్ లు, దారి దోపీడీలు చేశామని పోలీసు కస్టడీలో ఉన్న నిందితులు అంగీకరించడంతో మరన్ని వివరాలు బయటకు లాగడానికి రహస్య ప్రాంతంలో వారిని పోలీసులు విచారణ చేస్తున్నారు.

 ఆడదాని వయసుతో మాకు పనిలేదు

ఆడదాని వయసుతో మాకు పనిలేదు

మాకు వయసుతో పని లేదు, ఆంటీనా అమ్మాయా అని మేము ఆలోచించము, ఆడది కనపడిందా మా పని మేము చేసుకోని పోతామని టెంపర్ సినిమాలో లాగా కామాంధులు డైలాగులు చెప్పారని తెలిసింది. దారి దోపిడీలు చెయ్యడానికి మేము ప్రయత్నిస్తామని, ఆ సమయంలో ఆంటీలు కనపడినా, అమ్మాయిలు కనపడినా సరే వారిని నిర్జనప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశామని నిందితులు పోలీసుల ఇచ్చిన ట్రీట్మెంట్ లో అంగీకరించారని ఓ పోలీసు అధికారి అంటున్నారు.

 టైమ్ బాగాలేక ఇప్పుడు చిక్కాము..... గతంలో చాలానే చేశాము

టైమ్ బాగాలేక ఇప్పుడు చిక్కాము..... గతంలో చాలానే చేశాము

తమిళనాడు నుంచి అరటికాయల లోడ్ తీసుకుని వచ్చిన కామాంధులు మందు పార్టీ చేసుకోవడానికి మైసూరు సమీపంలోని అటవి ప్రాంతంలోకి వెళ్లి అదే సమయంలో అటువైపు వచ్చిన ప్రేమికులను పట్టుకుని దారుణం చేశారని పోలీసులు అంటున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి మేము చాలా మందిని అత్యాచారం చేశామని, అయితే ఎప్పుడు పోలీసులకు చిక్కలేదని, ఇప్పుడు టైమ్ బాగాలేక చిక్కిపోయామని ఓ నిందితుడు నేరం అంగీకరించాడని ఓ సీనియర్ పోలీసు అధికారి కన్నడ దిన పత్రిన ప్రజావాణికి చెప్పారు.

 సార్ మేము ఆరు మంది కాదు.... 7 మంది ఉన్నాము ?

సార్ మేము ఆరు మంది కాదు.... 7 మంది ఉన్నాము ?

ఇన్ని రోజులు మైసూరు కాలేజ్ అమ్మాయి మీద ఆరు మంది గ్యాంగ్ రేప్ చేశారని ప్రచారం జరిగింది. అయితే మేము ఆరు మంది కాదు ఏడు మంది కాలేజ్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేశామని, ఇక్కొక్కడు ఉన్నాడని నిందితులు అంగీకరించడంతో ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరి కోసం కర్ణాటక పోలీసులు తమిళనాడు, కేరళలో కామాంధుల కోసం గాలిస్తున్నారు.

 హడలిపోతున్న అమ్మాయిలు, మహిళలు

హడలిపోతున్న అమ్మాయిలు, మహిళలు

మైసూరు వచ్చిన ప్రతిసారి మేము మందుపార్టీలు చేసుకుని రేప్ లు చేస్తాము, దారి దోపిడీలు చేస్తాము, ఇది పోలీసుల విచారణలో కామాంధులు ఇచ్చిన స్టేట్ మెంట్ అని వెలుగు చూడటంతో స్థానికులు బిత్తరపోయారు. మేము వచ్చిన వేళా విశేషం ఇంతకాలం బాగుంది. ఇప్పుడు మాకు ప్లాన్ రివర్స్ అయ్యిందని మైసూరు గ్యాంగ్ రేప్ కేసులో అరెస్టు అయిన నిందితులు చెప్పారని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పడంతో స్థానికంగా నివాసం ఉంటున్న వివాహిత మహిళలు, యువతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ఎలా చిక్కారంటే ?

ఎలా చిక్కారంటే ?

ఎంబీఏ చదువుతున్న అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగే సమయంలో అక్కడే ఆమె స్నేహితుడు ఉన్నాడు. తమిళ్ లో మాట్లాడుతున్న యువకులు మా మీద దాడి చేసి తన స్నేహితురాలి మీద గ్యాంగ్ రేప్ చేశారని అతను పోలీసులకు చెప్పారు. ఆగస్టు 24వ తేదీన చాముండి కొండ పరిసర ప్రాంతాల్లో తమిళనాడుకు చెందిన మొబైల్ ఫోన్ నెంబర్లు ఏవేవి ఉన్నాయి ? అని పోలీసులు మొదట విచారణ చెయ్యడంతో నిందితుల ఆచూకి చిక్కిందని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.

 అర్దరాత్రి ఐదు మంది చిక్కారు

అర్దరాత్రి ఐదు మంది చిక్కారు

మైసూరు అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసిన నిందితులు తరువాత చామరాజనర్ మీదుగా గతంలో వీరప్పన్ అడ్డా అయిన సత్యమంగలం చేరుకున్నారు. తరువాత సత్యమంగటం సమీపంలోని తరుప్పూర్ పరిసర గ్రామాల్లో నిందితులు తలదాచుకున్నారని పోలీసులు గుర్తించారు. అరెస్టు అయిన ఐదు మందిని వేకువ జామున 3 గంటల నుంచి ఉదయం ఆరు గంటలలోపు అరెస్టు చేశామని ఓ సీనియర్ పోలీసు అధికారి ప్రజావాణి కన్నడ దినపత్రిక ప్రజావాణికి చెప్పారు.

Recommended Video

    Siddaramaiah Misbehaves With Women In Public Meeting | Oneindia Telugu
     కామాంధులను విమానం ఎక్కించిన పోలీసులు

    కామాంధులను విమానం ఎక్కించిన పోలీసులు

    ఇప్పటికే ఒకడు చిక్కలేదని వెతుకుతున్న పోలీసులు ఇంకొక్కడు ఉన్నాడని తెలిసి వాడి కోసం గాలిస్తున్నారు. గతంలో కామాంధులు అత్యాచారం చేసిన మహిళలు, యువతులు ఎక్కడ ఉన్నారు ? వారి నుంచి రహస్యంగా స్టేట్ మెంట్ తీసుకుని కోర్టు ముందు నివేదిక సమర్పించాలని ఆలోచిస్తున్నామని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు. మొత్తం మీద మతిపోయే విషయాలు చెబుతున్న కామాంధులకు పోలీసులు రహస్య ప్రాంతంలో విమానం ఎక్కించి మొత్తం విషయాలు బయటకు లాగుతున్నారని తెలిసింది. అయితే గ్యాంగ్ రేప్ కు గురైన యువతిని ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటికే ముంబాయి పిలిచుకుని వెళ్లి పోయారని పోలీసు అధికారులు అంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+