రాహుల్ గాంధీకి తీవ్ర జ్వరం: ప్రధాని మోడీ ఆందోళన
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర అస్వస్థతకు గురైనారు. తీవ్ర జ్వరంతో ఆయన ఇంటికే పరిమితం అయ్యారని తెలుసుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన చెందారు. రాహుల్ గాంధీ త్వరగా కోలుకోవాలని మోడీ ఆ దేవుడిని వేడుకున్నారు.
రాహుల్ గాంధీ అనారోగ్యంతో ఉన్నారని తెలుసుకున్న నరేంద్ర మోడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. రాహుల్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ. నడ్డా ట్విట్టర్ లో తెలిపారు. తీవ్ర జ్వరంతో ఉన్న రాహుల్ గాంధీ గత వారంలో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికల పర్యటనలో పర్యటించవలసి ఉంది.

అయితే తీవ్ర జ్వరం కారణాంగా రాహుల్ గాంధీ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్న రాహుల్ గాంధీ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ త్వరగా కొలుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు పూజలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications