భారతదేశం నియతృత్వధోరణిలోకి నెట్టబడుతోంది.. రాహుల్ గాంధీ
భారత దేశం లాంటీ యువ నాయకత్వం ఉన్న చాల దేశాలు నియంతృత్వధోరణిలోకి నెట్టబడుతున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. భారత తొలి ప్రధాని జవహార్లాల్ నెహ్రు 55వ వర్థంతి సంధర్భంగా ట్విట్టర్లో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈనేపథ్యలోనే 70 సంవత్సరాలపాటు భారత దేశాన్నిపటిష్టమైన ప్రజాస్వామిక దేశంగా కొనసాగడానికి బాటలు వేసిన నెహ్రు సేవలను ప్రజలు గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన కోరారు. నెహ్రు కొనసాగించిన విధానవల్లే భారతదేశం ప్రజాస్వామిక విలువలను కొనసాగిస్తుందని అన్నారు.
ఇక ప్రధాని నరేంద్రమోడీ, నెహ్రుకు ఉదయమే నివాళులు అర్పిస్తూ ట్విట్టర్ వేదికగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ ఉపరాష్ట్ర్రపతి హమీద్ అన్సారీలు నెహ్రుకు సమాధి అయిన శాంతివన్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం ఆయన చేసిన చేసిన సేవలను పలువురు కొనియాడారు.

కాగ ఇటివల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందండంతో యువ నాయకత్వం ఉన్న భారతదేశం రానున్న రోజుల్లో నియతృత్వధోరణిలోకి వెళుతుందన్న వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి.ప్రస్థుత ప్రధాని నరేంద్రమోడీ తిరిగి రెండవ సారి అధికారం చేపట్టిన నేపథ్యంలో ఈ రాహుల్ వ్యాఖ్యలు రాజకీయంగా దూమారం లేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications