పోలింగ్ డే: కన్నడ ఓటర్లకు మోడీ, రాహుల్ పిలుపు
Recommended Video

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. శనివారం ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా, ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటక ప్రజలకు విధిగా ఓటు వేయాలని కోరారు.

కర్ణాటక ప్రజలు పెద్ద ఎత్తన పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం నేపాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ట్విట్టర్ వేదిక కర్ణాటక ఎన్నికలపై స్పందించారు.
Urging my sisters and brothers of Karnataka to vote in large numbers today. I would particularly like to call upon young voters to vote and enrich this festival of democracy with their participation.
— Narendra Modi (@narendramodi) May 12, 2018
'కర్ణాటక సోదరసోదరీమణులను నేను కోరేది ఒక్కటే. నేటి పోలింగ్లో పెద్ద సంఖ్యలో ఓటింగ్ నమోదవ్వాలి. ముఖ్యంగా యువ ఓటర్లు ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి' అని ప్రధాని మోడీ కన్నడ ప్రజలను కోరారు.
ಕರ್ನಾಟಕದ ನನ್ನ ಸೋದರಿಯರೇ ಹಾಗೂ ಸೋದರರೇ, ಇಂದು ಮತದಾನ ಮಾಡಿ. ಪ್ರಮುಖವಾಗಿ ಯುವ ಮತದಾರರು ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ಹಬ್ಬದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ತಮ್ಮ ಹಕ್ಕು ಚಲಾಯಿಸುವಂತೆ ಕೋರುತ್ತೇನೆ
— Narendra Modi (@narendramodi) May 12, 2018
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 'ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతం క్రియాశీల ప్రజాస్వామ్యానికి నిదర్శనం. కర్ణాటక ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని ఈ ప్రజాస్వామ్య పండగను మరింత రెట్టింపు చేయాలి. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేయబోతున్న యువ స్నేహితులకు సాదర స్వాగతం' అని కన్నడలో ట్వీట్ చేయడం గమనార్హం.
ಮತದಾರರು ತಮ್ಮ ಹಕ್ಕನ್ನು ತಪ್ಪದೇ ಚಲಾಯಿಸುವುದೇ ಕ್ರಿಯಾತ್ಮಕ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ಸಂಕೇತ. ನಾನು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಮೊದಲ ಬಾರಿ ಮತ ಚಲಾಯಿಸುವ ನನ್ನೆಲ್ಲಾ ಯುವ ಸ್ನೇಹಿತರನ್ನು ಸ್ವಾಗತಿಸುತ್ತೇನೆ.
— Rahul Gandhi (@RahulGandhi) May 12, 2018
ಕರ್ನಾಟಕದ ಜನತೆ ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ಅತೀದೊಡ್ಡ ಹಬ್ಬವನ್ನು ಸಂಭ್ರಮದಿಂದ ಆಚರಿಸಿ ಯಶಸ್ವಿಗೊಳಿಸುವಂತೆ ಕೋರಿಕೊಳ್ಳುತ್ತೇನೆ.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీజేపీలు నిన్నటి వరకు విస్తృత ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటే తామే ఏర్పాటు చేస్తామంటూ ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఇక జేడీఎస్ కూడా తాము కింగ్ మేకర్ కాదు కింగేనంటూ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications