హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Encounter: ఎన్ కౌంటర్ పై సుమోటోగా కేసు: స్పాట్ కు నిజ నిర్ధారణ కమిటీ..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వెటర్నరి డాక్టర్ దిశ హత్యోదంతంలో నలుగురు నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఘటనపై నిజ నిర్ధారణ కమిటీ వేయనుంది. దేశ రాజధాని నుంచి ప్రత్యేక బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించనుంది. దీనిపై సమగ్ర నివేదికను అందించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇదివరకే తెలంగాణ ప్రభుత్వాన్ని సూచించిన విషయం తెలిసిందే.

ఆ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ కు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్: వీరప్పన్ ను మట్టుబెట్టడంతో..!ఆ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ కు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్: వీరప్పన్ ను మట్టుబెట్టడంతో..!

 సుమోటోగా కేసు

సుమోటోగా కేసు

తెలంగాణలో షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి ఫ్లైఓవర్ కింద మహమ్మద్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులును శుక్రవారం తెల్లవారు జామున పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం సంఘటనాస్థలానికి తీసుకెళ్లగా వారు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారని. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై దాడికి పాల్పడ్డారని. దీనితో ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందంటూ పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన మొత్తాన్నీ జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుంది. మీడియాలో వచ్చిన కథనాలఆధారంగా కేసు స్వీకరించింది.

Recommended Video

Disha Issue : బ్రేకింగ్ : నిందితుల ఎన్ కౌంటర్... EXCLUSIVE ఎన్ కౌంటర్ వీడియో
సంఘటనా స్థలానికి నిజ నిర్ధారణ కమిటీ..

సంఘటనా స్థలానికి నిజ నిర్ధారణ కమిటీ..

ఎన్ కౌంటర్ చేయడానికి గల కారణాలు, అక్కడి పరిస్థితులను తెలుసుకోవడానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ త్వరలో ఓ నిజ నిర్ధారణ కమిటీని సంఘటనా స్థలానికి పంపించనుంది. వెటర్నరి డాక్టర్ దిశ అత్యాచారానికి, హత్యకు గురైన శంషాబాద్ తొండుపల్లి టోల్ గేట్ సమీపంలోని స్థలాన్ని, కాలిపోయిన స్థితిలో దిశ మృతదేహం లభించిన చటాన్ పల్లి ఫ్లైఓవర్ ప్రాంతాన్ని నిజ నిర్ధారణ కమిటీ పరిశీలిస్తుంది. దిశ మృతదేహం లభించిన ప్రదేశంలోనే ఎన్ కౌంటర్ చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

పోలీసుల వాదనలు, మీడియా కథనాలే ఆధారంగా..

పోలీసుల వాదనలు, మీడియా కథనాలే ఆధారంగా..

నలుగురు అత్యాచార నిందితులను ఎన్ కౌంటర్ చేయడానికి హైదరాబాద్ పోలీసులు వెల్లడించిన కారణాలు, మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని జాతీయ మానవ హక్కుల కమిషన్ తన దర్యాప్తును కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. నిజ నిర్ధారణ కమిటీ ఇచ్చే నివేదికకు ప్రస్తుతం పోలీసులు చెబుతోన్న కారణాలు, సంఘటనాలో గుర్తించిన ఆధారాలు, మీడియా కథనాలను క్రోడీకరించిన అనంతరం జాతీయ మానవ హక్కుల కమిషన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుందని అంటున్నారు.

English summary
The National Human Rights Commission (NHRC) has taken suo motu cognizance of news reports about the encounter in which four men accused of rape-murder of a veterinary doctor were killed by the Telangana Police. According to the police, the four accused – Mohammad Ali alias Mohammad Arif, Jollu Shiva, Jollu Naveen Kumar and Chintakunta Chenna Keshavulu – were taken to Chattanpalli to reconstruct the scene of crime where they allegedly attacked the cops and tried to run away from the spot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X