జార్ఖండ్లో రెచ్చిపోయిన నక్సలైట్లు.. బీజేపీ ఆఫీస్పై బాంబు దాడి...
కుంతి : మహారాష్ట్ర గడ్చిరోలి ఘటన మరువక ముందే జార్ఖండ్లో నక్సల్స్ మరోసారి రెచ్చిపోయారు. సరాయ్కేలా జిల్లాలోని కుంతి నియోజకవర్గ బీజేపీ ఆఫీసును బాంబులతో పేల్చేశారు. శుక్రవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా జార్ఖండ్లో ప్రచారానికి వస్తున్న నేపథ్యంలో నక్సలైట్ల చర్య చర్చనీయాంశంగా మారింది.
గురువారం అర్థరాత్రి 12.30గం. సమయంలో నక్సలైట్లు బీజేపీ ఆఫీసుపై దాడి చేసినట్లు సమాచారం. పార్టీ ఆఫీసును పేల్చివేసేందుకు నక్సల్స్ కేన్ బాంబులు ఉపయోగించినట్లు తెలుస్తోంది. జార్ఖండ్ మాజీ సీఎం అర్జున్ ముండా కుంతి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం కుంతి, కోడర్మా, రాంచీల్లో నిర్వహించనున్న ఎలక్షన్ ర్యాలీల్లో పాల్గొనాలని నిర్ణయించారు. ఇదే అదునుగా నక్సలైట్లు పార్టీ ఆఫీసును పేల్చివేశారు. ప్రస్తుతం కుంతి నియోజకవర్గానికి కరియా ముండా ప్రాతినిధ్యం వహిస్తుండగా. ఇక్కడ మే 6న ఐదో దశలో ఎన్నిక జరగనుంది.

-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications