వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నలుగురు కానిస్టేబుళ్లను కిడ్నాప్ చేసిన మావోలు

|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో నలుగురు పోలీసు కానిస్టేబుళ్లను సాయుధ మావోయిస్టులు అపహరించారు. రాష్ట్ర పోలీసు శాఖ అనుబంధ సిబ్బందిగా నియమించుకున్న వీరిని కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బస్సులో ప్రయాణిస్తుండగా నక్సల్స్ అపహరించుకుపోయారని అడిషనల్ డిజిపి(నక్సల్స్ ఆపరేషన్స్) ఆర్‌కే విజ్ చెప్పారు.

అపహరణకు గురైనవారు అసిస్టెంట్ కానిస్టేబుల్ హోదాలో ఉన్నారని తెలిపారు. మావోయిస్టులు అపహరించినవారిలో జయదేవ్ యాదవ్, మంగళ్ సోధి, రాజు తేలా, రామా మజ్జి ఉన్నారు.

 Naxals' menace continues: 4 police officials abducted in Chhattisgarh

నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లలో రాష్ట్ర పోలీసులకు సహకరించేందుకు ఈ నలుగురు కానిస్టేబుళ్లు నియమితులయ్యారు. ఇలా నియమించిన వారిని ఫాలోవర్స్ అని కూడా పిలుస్తారు. ఈ ఘటన గురించి తెలియగానే వారిని రక్షించేందుకు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే వారి ఆచూకీ ఇంత వరకూ తెలియరాలేదు.

సొహ్రాబుద్దీన్ కేసు నుంచి ఐపీఎస్‌కు విముక్తి

సొహ్రాబుద్దీన్ షేక్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసు నుంచి ఐపిఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంకు సిబిఐ కోర్టు విముక్తి కల్పించింది. బాలసుబ్రహ్మణ్యంపై సిబిఐ నమోదు చేసిన అభియోగాలను నిరూపించే సాక్ష్యాధారాలు లేకపోవడంతో సిబిఐ కోర్టు జడ్జి ఎంబి గోస్వామి సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

English summary
Giving open message that we are not at all afraid of security forces, the Naxalites has kidnapped four police officials in Chhattisgarh. The incident reportedly took place in the Bijapur district of the BJP ruled state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X