దేశ విభజనకు కారణం ముగ్గురే-NCERT మరో వివాదం-కాంగ్రెస్, ఓవైసీ ఫైర్..!
ఎప్పుడో 1947లో జరిగిన దేశ విభజన గాయాల్ని గుర్తుచేస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రచారానికి ఇప్పుడు జాతీయ విద్యావిషయక పరిశోధన మండలి (ఎన్సీఈఆర్టీ) కూడా జతకలిసింది. అప్పట్లో జరిగిన ఘటనల్ని విద్యార్ధులకు పాఠాల రూపంలో అందించే క్రమంలో తాజాగా రూపొందించిన ప్రత్యేక పాఠంలో పేర్కొన్న అంశాల్లో కాంగ్రెస్ పార్టీని, ముస్లింలను టార్గెట్ చేసింది. దీంతో ఈ రెండు వర్గాలు ఎన్టీఈఆర్టీ తీరుపై మండిపడుతున్నాయి.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని మెప్పించే క్రమంలో వరుసగా పాఠ్యాంశాల్లో వివాదాస్పద అంశాల్ని చొప్పిస్తున్న ఎన్సీఈఆర్టీ మరో తేనెతుట్టె కదిపింది. 1947లో జరిగిన దేశ విభజన గాయాలను విద్యార్ధులకు పరిచయం చేసే క్రమంలో ఈ ఘటనలకు ముగ్గురు ప్రధాన కారణమంటూ పేర్కొనడం వివాదాస్పదమైంది. అప్పట్లో ఏకగ్రీవంగా జాతీయ నేతలు తీసుకున్న నిర్ణయాల్ని ముగ్గురికి ఆపాదిస్తూ ఎన్టీఈఆర్టీ ఈ పాఠ్యాంశాల్ని రూపొందించింది. ముస్లింలీగ్ నేత మొహమ్మద్ అలీ జిన్నా దేశ విభజనను ప్రతిపాదిస్తే భారత జాతీయ కాంగ్రెస్ దాన్ని ఆమోదించిందని, చివరి వైశ్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ దాన్ని అమలు చేశాడని ఆరోపించింది.

దేశ విభజన కాశ్మీర్ ను దేశానికి కొత్త భద్రతా సమస్యగా మార్చిందని ఇందులో ఎన్సీఈఆర్టీ పేర్కొంది. అప్పటి నుంచీ పొరుగుదేశాల్లో ఒకటి దీన్ని భారత్ కు పలు సమస్యలు తెచ్చిపెట్టేందుకు వాడుకుంటోందని పాకిస్తాన్ నుద్దేశించి వెల్లడించింది. 1940లో జిన్నా హిందూ-ముస్లింలు రెండు వేర్వేరు గ్రామాలు, భావజాలాలు, సాంఘిక ఆచారాలు, సాహిత్యం కలిగిన వారని చెప్పినట్లు తెలిపింది. బ్రిటీష్ వాళ్లు భారత్ ను ఐక్యంగా ఉంచేందుకు ప్రయత్నించారని అయితే కాంగ్రెస్ దాన్ని ఒప్పుకోలేదని పేర్కొంది. భారత్ ను ఏకం చేసిన వల్లభాయి పటేల్ కూడా అంతర్గత యుద్ధం నివారించాలంటే విభజనే మార్గం అన్నారని తెలిపింది. అలాగే గాంధీ విభజనను వ్యతిరేకించినప్పటికీ హింస ద్వారా కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకించనని చెప్పారంది.

ఎన్సీఆర్టీ వాదనపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. వాస్తవాలు చెప్పని ఈ పాఠ్యాంశాన్ని తగులపెట్టాలని కాంగ్రెస్ అధికారప్రతినిధి పవన్ ఖేరా డిమాండ్ చేశారు. హిందూ మహాసభ , ముస్లిం లీగ్ మధ్య సమన్వయంతో విభజన జరిగిందని తెలిపారు. విభజన ఆలోచన ముందుగా చేసింది 1938లో హిందూ మహాసభేనని, దీన్ని జిన్నా 1940లో రిపీట్ చేశారన్నారు. అటు ఎంఐఎం అధినేత ఓవైసీ సైతం ఎన్సీఈఆర్టీ ముస్లింలను విభజన దోషులుగా చూపించడంపై మండిపడ్డారు.

#WATCH | Hyderabad, Telangana | AIMIM MP Asaduddin Owaisi says, "Include the book 'Muslims Against Partition' by Shamsul Islam in the NCERT... This lie is told again and again about Partition. At that time, not even 2-3% Muslims had the right to vote, and today people blame us… pic.twitter.com/v0tnMG8jeZ
— ANI (@ANI) August 16, 2025
ఇందులో షంసుల్ ఇస్లాం రాసిన 'ముస్లింస్ ఎగైనెస్ట్ పార్టిషన్' పుస్తకాన్ని కూడా చేర్చాలన్నారు. ఈ అబద్ధం విభజన గురించి పదే పదే చెబుతోందని, ఆ సమయంలో 2-3 శాతం ముస్లింలకు కూడా ఓటు హక్కు లేదన్నారు. ఇవాళ ప్రజలు విభజనకు తమను నిందిస్తున్నారని, దానికి మేం ఎలా బాధ్యులమన్నారు. ఇక్కడి నుండి పారిపోయిన వారు పారిపోయారు, విశ్వాసపాత్రులుగా ఉన్నవారు అక్కడే ఉండిపోయారని గుర్తుచేశారు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications