గూగుల్కు చుక్కలు చూపించిన ఎన్సీఎల్ఏటీ..!!
న్యూఢిల్లీ: టాప్ సెర్చింజిన్ గూగుల్ కు నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ భారీ జరిమానా విధించింది. ఈ మేరకు గూగుల్ యాజమాన్యానికి ఉత్తర్వులు ఇచ్చింది. ఈ జరిమాన విలువ 1,337.76 కోట్ల రూపాయల్లో 10 శాతం. 2022 అక్టోబర్ లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గూగుల్ పై విధించిన ఫైన్ ఇది. ఈ జరిమానా మొత్తాన్ని చెల్లించాల్సిందేనని ఆదేశించింది. ఈ విషయంలో సీసీఐ ఆదేశాలను సమర్థించింది.
ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ ఎకోసిస్టమ్ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు పెనాల్టీని చెల్లించాలంటూ గతంలోనే గూగుల్ యాజమాన్యంపై కాంపిటీషన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై గూగుల్ యాజమాన్యం నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ లో సవాల్ చేసింది. ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది.

ఈ పిటీషన్ ను ఎన్సీఎల్ఏటీ న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ అలోక్ శ్రీవాస్తవతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సీసీఐ విధించిన జరిమానాపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. అప్పీలెంట్ గూగుల్.. తాను చెల్లించాల్సిన జరిమానా మొత్తంలో 10 శాతాన్ని తాత్కాలికంగా రిజిస్ట్రార్ వద్ద డిపాజిట్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం ఈ కేసుపై తదుపరి విచారణను ఫిబ్రవరి 13వ తేదీకి వాయిదా వేసింది.
గూగుల్ తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ తన ఎన్సీఎల్ఏటీ ధర్మాసనం ముందు తన వాదనలను వినిపించారు. యూరోపియన్ యూనియన్ తీర్పులోని పలు భాగాలను వర్డ్ టు వర్డ్ సీసీఐ కాపీ చేసిందని పేర్కొన్నారు. యూరోపియన్ కమిషన్ నిర్ణయాలు సీసీఐకి వర్తించబోవని, భారత్ లోని చట్టాలు దీనికి అంగీకరించవని చెప్పారు.
ఫైన్ విధిస్తూ సీసీఐ తీసుకున్న నిర్ణయం వల్ల గూగుల్ తన వ్యాపార కార్యకలాపాలను మార్చుకోవాల్సి వస్తుందని, ఇది యూజర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని మను సింఘ్వీ అన్నారు. నిష్పాక్షిక, చట్టబద్ధంగా విచారణను జరిపించడంలో సీసీఐ విఫలమైందని అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. గూగుల్ మొబైల్ యాప్ పంపిణీ పద్ధతులు పోటీకి అనుకూలమైనవని వివరించారు. కాగా సీసీఐ ఇచ్చిన ఈ ఆదేశాలపై తాము అప్పీల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు గూగుల్ అప్పట్లోనే తెలిపింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications