ఆధిక్యంలో బీజేపీ.. మేజిక్ ఫిగర్ దాటిన ఎన్డీఏ
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు దూసుకుపోతున్నాయి. 542 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో ఆ పార్టీలు సత్తా చాటుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఆధిక్యాల ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ను ఎన్డీఏ దాటేసింది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు 272 మంది ఎంపీల మద్దతు అవసరంకాగా.. ఎన్డీఏ ఇప్పటికే ఆ మార్కు దాటి దూసుకుపోతోంది.
ప్రస్తుతం ఎన్డీయే కూటమిలోని పార్టీలు 300 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు దాదాపు 100కుపైగా సీట్లలో ముందంజలో ఉన్నాయి. ఇతర కూటములు, ప్రాంతీయ పార్టీలు 100 స్థానాల్లో తమ హవా కొనసాగిస్తున్నాయి. వారణాసి నియోజకవర్గంలో ప్రధాని నరేంద్రమోడీ ఆదిక్యంలో కొనసాగుతున్నారు.













Click it and Unblock the Notifications