Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Citizenship Bill: సరైన అవగాహనే లేదంటూ యూఎస్ ప్యానెల్‌కి భారత్ కౌంటర్

న్యూఢిల్లీ: లోక్‌సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లుపై అమెరికాకు చెందిన యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్(యూఎస్‌సీఐఆర్ఎఫ్) చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. బిల్లుపై ఆ సంస్థ చేసిన వ్యాఖ్యలు ధృవీకరించదగినవి కావని భారత విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ తేల్చి చెప్పారు.

పౌరసత్వ చట్ట సవరణ బిల్లు(సీఏబీ) గానీ, జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ) గానీ.. ఈ రెండింటిలో ఏదీ కూడా భారతీయుడి పౌరసత్వాన్ని తొలగించవని ఓ ప్రకటనలో తేల్చి చెప్పారు. ఈ బిల్లు కేవలం బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో హింసకు గురై భారతదేశానికి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం కల్పించడం కోసమేనని రవీశ్ కుమార్ స్పష్టం చేశారు.

Neither accurate nor warranted: India rejects US panel’s criticism on Citizenship Bill

భారత పౌరసత్వ చట్ట సవరణ బిల్లు సోమవారం సుమారు 12 గంటల సుదీర్ఘ చర్చ అనంతరం లోక్‌సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అయితే, ఈ బిల్లుపై అమెరికాకు చెందిన యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్(యూఎస్‌సీఐఆర్ఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది.

మత ప్రాతిపదికన రూపొందించిన ఈ బిల్లును 'తప్పుడు దిశలో వెళుతున్న ప్రమాకరపు మలుపు' అంటూ వ్యాఖ్యానించింది. ఈ బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా కేంద్ర ప్రభుత్వ నాయకత్వంపై ఆంక్షల్ని విధించే అంశాల్ని పరిశీలించాలని సూచించింది. ఈ క్రమంలోనే రవీశ్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఈ బిల్లుపై సరైన అవగాహన లేకుండా యూఎస్‌సీఐఆర్ఎఫ్ చేసిన వ్యాఖ్యలు అంగీకరించదగినవి కావని స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+