కరోనా వ్యాక్సినేషన్ కొత్త మార్గదర్శకాలు ఇవే..
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాకు వ్యాక్సిన్ కంపల్సరీ. రెండు డోసుల టీకా వేసుకుంటే 6 నెలలు బేఫికర్గా ఉండొచ్చు. నిపుణులు కూడా టీకా వేసుకోవడమే ఉత్తమం అని అంటున్నారు. దీంతో కరోనా వ్యాక్సినేషన్ పై నిపుణుల కమిటీ సిఫారసుల నేపథ్యంలో కేంద్రం ప్రభుత్తం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారు ఇకపై 3 నెలల తర్వాతే టీకా తీసుకోవాల్సి ఉంటుంది.
Recommended Video

వ్యాక్సినేషన్కు ఇదివరకు ఇది 4 నుంచి 8 వారాలు ఉండగా.... ఇప్పుడు దీన్ని 3 నెలలకు పెంచారు. తొలి డోసు తీసుకున్నాక కరోనా సోకినా ఇదే నిబంధన వర్తిస్తుంది. కోలుకున్న తర్వాత 3 నెలలకు రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర వ్యాధులకు ఆసుపత్రిలో చికిత్స పొందినవారు కోలుకున్న తర్వాత 4 నుంచి 8 వారాల వ్యవధితో వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్లాస్మా థెరపీ చేయించుకున్నవాళ్లు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక 3 నెలలకు వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది.
వ్యాక్సినేషన్ కు ముందు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు అవసరం లేదని కేంద్రం పేర్కొంది. బాలింతలు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చని స్పష్టం చేసింది. కరోనా నుంచి కోలుకున్నవారు, వ్యాక్సిన్ పొందినవారు 14 రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చని తాజా మార్గదర్శకాల్లో వివరించారు.












Click it and Unblock the Notifications