సిక్కా కంటే తక్కువే, ఇన్పోసిస్ కొత్త సీఈవో వేతనం ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: ఇన్పోసిస్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సలీల్ పరేఖ్ 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.16.25కోట్ల వేతనాన్ని తీసుకోన్నారని ఆ కంపెనీ ప్రకటించింది..ఇన్పోసిస్కు అంతకముందు సీఈవోగా ఉన్న విశాల్ సిక్కా వేతనం కింద సుమారు రూ.43 కోట్లు పొందేవారు.
వేతనం కింద రూ.6.5 కోట్లు, దీనికి తోడు రూ.9.75 కోట్లను వేరియబుల్ చెల్లింపుల కింద పొందుతారని ఇన్పోసిస్ ప్రకటించింది. ఈ మేరకు స్వతంత్ర బోర్డు సభ్యురాలు కిరణ్ మజుందర్షా ప్రకటించారు. రెండు రోజుల క్రితమే పరేఖ్ సీఈఓగా బాధ్యతలను చేపట్టారు. ఇన్పోసిస్ నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీలో కిరణ్ మజుందర్షా సభ్యురాలు.
నియంత్రిత స్టాక్ యూనిట్ల కింద కొత్త సీఈవో మరో రూ. 3.25 కోట్లను పొందనున్నారని, అదేవిధంగా వార్షిక పనితీరు కింద అందజేసే ఈక్విటీ గ్రాంట్లు రూ.13 కోట్లుగా ఉండనున్నట్టు ప్రకటించారు.
అంతేకాక ఒక్కసారి ఈక్విటీ గ్రాంట్ కింద పరేఖ్కు రూ.9.75 కోట్లు అందజేయనున్నట్టు చెప్పారు. ఇన్పోసిస్కు అంతకముందు సీఈవోగా ఉన్న విశాల్ సిక్కా వేతనం కింద సుమారు రూ.43 కోట్లు పొందేవారు.