రూ.200నోట్లపై ఆర్బీఐ షాకింగ్ నిర్ణయం!?..
అయితే కొత్తగా ప్రవేశపెట్టబోయే రూ.200నోట్ల విషయంలో ఆర్బీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నోట్లను కేవలం బ్యాంకు బ్రాంచుల ద్వారానే అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రవేశపెట్టిన రూ.2000 నోటుతో చిల్లర కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే. మార్కెట్లో రూ.500నోట్లు అందుబాటులో ఉన్నా.. పెద్ద నోటుకు సరిపడా చిల్లర దొరకని పరిస్థితి. దీంతో రూ.200నోటును ప్రవేశపెట్టాలని ఆర్బీఐ యోచిస్తోంది.
2017ఏడాది ముగియక ముందే ఈ కొత్త నోటును మార్కెట్లోకి తీసుకురావాలని ఆర్బీఐ ప్రయత్నిస్తోంది. దీనివల్ల చిల్లర కష్టాలు తీరనుండగా.. లోయర్ డినామినేషన్ నోట్లకు సంబంధించిన డిమాండ్-సప్లై మధ్య అంతరం తగ్గనుంది. అయితే కొత్తగా ప్రవేశపెట్టబోయే రూ.200నోట్ల విషయంలో ఆర్బీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నోట్లను కేవలం బ్యాంకు బ్రాంచుల ద్వారానే అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అంటే, ఈ నోట్లను ఏటీఎంలలో అందుబాటులో ఉంచరు. కేవలం బ్యాంకు ద్వారా లావాదేవీలు జరిపేవారికి మాత్రమే వీటిని అందించునున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పెద్ద నోటుకు, చిన్న నోటుకు మధ్య అంతరం భారీగా ఉండటంతో.. రూ.2వేల నోటుకు చిల్లర దొరకడం కష్టంగా మారింది. కొత్త రూ.200నోటుతో ఈ కష్టాలు తీరిపోనున్నాయి. ఇకపోతే రద్దయిపోయిన రూ.1వెయ్యి నోటును ఆర్బీఐ ఇప్పుడప్పుడే ప్రవేశపెట్టబోమని స్పష్టం చేసింది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications