శోభనం రాత్రే నవదంపతులు మృతి: ఇద్దరికీ ఒకేసారి గుండెపోటు! ఇదే కారణమా?
లక్నో: మూడు ముళ్లబంధంతో ఒక్కటైన ఓ యువ జంటకు తొలి రాత్రే చివరి రోజైంది. శోభవనం రోజు రాత్రి నవదంపతులకు ఒకేసారి గుండెపోటు రావడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో అప్పటి వరకు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో కళకళలాడుతున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రెయిచ్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ప్రతాప్ యాదవ్(24), పుష్ప (22)కు మే నెల 30న వివాహం జరిగింది. బారాత్ జరిగిన తర్వాతి రోజు పెళ్లికొడుకు ఇంట్లో శోభనం ఏర్పాటు చేశారు. దీంతో ఆ కొత్త జంట రాత్రి వారి రూంలోకి వెళ్లింది. అయితే, మర్నాడు ఉదయం ఎంత సేపయినా బయటకు రాలేదు. బంధువులు తలుపులు బద్దలుకొట్టి చూడగా బెడ్పై ప్రతాప్, పుష్ప విగత జీవులుగా కనిపించారు. దీంతో ఒక్కసారిగా ఆ ఇంట్లో విషాదం అలుముకుంది.

మరోవైపు, బంధువులు ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించారు. భార్యభర్తలు ఇద్దరూ ఒకే సమయంలో గుండెపోటుతో చనిపోయినట్లు పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు వెల్లడించారు. అయితే, కొత్త జంటలో ఎవరికీ గుండె సంబంధింత వ్యాధులు ఉన్న చరిత్ర లేదని.. ఒక్కరోజే ఇద్దరికీ గుండెపోటు రావడం మిస్టరీగా ఉందని వైద్యులు వెల్లడించారు. వారి మృతిపై మరింత ఎంక్వయిరీ చేసేందుకు వారి శరీరంలో నుంచి నమూనాలు సేకరించి లక్నోలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీకి పంపామని తెలిపారు.
కొత్త జంట మృతికి ఇదే కారణమా?
నూతన వధూవరులు గడిపిన గదిలో వెంటిలేషన్ లేదు. దీంతో గాలి ఆడకే ప్రతాప్, పుష్ప కార్డియాక్ అరెస్టుకు గురై చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కొత్త జంట పెళ్లి వేడుకలో రెండు రోజులపాటు తీరిక లేకుండా గడిపారని.. దీంతో వారు తీవ్రంగా అలసిపోయి ఉంటారని చెప్పారు. అదే సమయంలో వారికి శోభనం ఏర్పాటు చేయడంతో ఇలా జరిగి ఉండొచ్చని అంటున్నారు.

ఆ రూంలోకి బయటి వ్యక్తులు వచ్చిన ఆనవాళ్లేమీ కనిపించలేదు. వారిపై దాడి జరిగినట్లు కూడా పోస్టుమార్టం రిపోర్టులో తేలలేదు. దీంతో వారి మరణం మిస్టరీగా మారింది. పెళ్లి వేడుకలో జరిగిన ప్రతి సంఘటనపైనా ఎంక్వయిరీ చేస్తున్నాం. వారు ఏం తిన్నారో కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఫోరెన్సిక్ నిపుణులు కూడా వారు గడిపిన గదిని పరిశీలించారు. మరింత లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని పోలీసులు వెల్లడించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications