జాతి తక్కువ, చంపేస్తాం: పోలీసులు మాత్రం, కోర్టును ఆశ్రయించిన ప్రేమ జంట !
ప్రేమ వివాహం చేసుకున్న నవవధూవరులకు చంపేస్తాం అంటూ బెదిరింపు ఫోన్లు ఎక్కువ కావడంతో వారు కోర్టును ఆశ్రయించి భద్రత కల్పించాలని మనవి చేశారు.
బెంగళూరు: ప్రేమ వివాహం చేసుకున్న నవవధూవరులకు చంపేస్తాం అంటూ బెదిరింపు ఫోన్లు ఎక్కువ కావడంతో వారు కోర్టును ఆశ్రయించి భద్రత కల్పించాలని మనవి చేశారు. మా ప్రాణాలకు ఏదైనా జరగరానిది జరితే అందుకు మా కుటుంబ సభ్యులే కారణం అంటూ కోర్టులో కేసు పెట్టారు.
బెంగళూరులో అక్కా, చెల్లి పెళ్లి, కాపురం: తలపట్టుకున్న ఫ్యామిలీ, కేసు !
కర్ణాటకలోని హుబ్బళి-దారావాడ జంట నగరాల సమీపంలోని ఎత్తినగుడ్డ ప్రాంతంలో నివాసం ఉంటున్న దేవేంద్ర గౌడ, పవిత్ర గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పవిత్ర కంటే దేవేంద్ర తక్కువ కులం కావడంతో పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇదే సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీన ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. జూన్ 29వ తేది చట్టప్రకారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటి నుంచి దేవేంద్ర, పవిత్ర దంపతులకు ఫోన్లు చేసి మిమ్మల్ని చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారు.
నగ్నంగా మహిళ, మర్మాంగంలో కారం పొడి, రోడ్డులో ఊరేగింపు, నా మొగుడితో నీకేం పని !
ప్రాణాలు తీస్తామని బెదిరింపులు ఎక్కువ కావడంతో హుబ్బళి- దారవాడలోని ఉప నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు దేవేంద్ర, పవిత్రలను పట్టించుకోకుండా కేసు నమోదు చెయ్యకపోవడంతో గురువారం కోర్టును ఆశ్రయించారు. పవిత్ర కుటుంబ సభ్యుల మీద చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.