అనూహ్య మలుపు తిరిగిన పహల్గామ్ ఉగ్రదాడి..!!
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ బిగ్ బ్రేక్ త్రూ సాధించింది. ఈ ఘటనతో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఈ అరెస్టులు- ఈ అమానుష ఘటనకు సంబంధించిన దర్యాప్తులో కీలక మలుపుగా భావిస్తోన్నారు. విచారణ సందర్బంగా ఉగ్రవాద దాడి మూలాలు వెలుగులోకి వస్తాయని అంచనా వేస్తోన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ లో ఉగ్రవాదులు మారణ హోమానికి పాల్పడిన విషయం తెలిసిందే. కాశ్మీర్ అందాలను తిలకించడానికి వచ్చిన పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలను కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ఇద్దరు ఏపీకి చెందిన వాళ్లూ ఉన్నారు.

ఈ ఘటనపై విచారణ బాధ్యతలను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది.. కేంద్ర ప్రభుత్వం. అదే సమయంలో ఈ నరమేధానికి పాకిస్తాన్ ప్రోత్సాహిత ఉగ్రవాదులే కారణమని ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలపై పాక్ వైఖరిని ఎండగట్టింది. ఆ దేశంపై యుద్ధానికీ దిగింది.
ఈ క్రమంలో- తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేయడంతో కీలక మలుపు తిరిగినట్టయింది. పర్వేజ్ అహ్మద్ జొథార్, బషీర్ అహ్మద్ జొథార్ అరెస్ట్ అయ్యారు. పర్వేజ్ స్థానికుడే. పహల్గామ్ సమీపంలోని బట్ కోట్ అతని స్వస్థలం. బషీర్ అహ్మద్ హిల్ పార్క్కు చెందిన వ్యక్తి. ఈ ఇద్దరిపై అసాంఘిక కార్యకలాపాల నివారణచట్టం (యూఏపీఏ) సెక్షన్ 19 కింద అరెస్టు చేసింది ఎన్ఐఏ.
విచారణ సందర్భంగా పహల్గామ్ దాడికి పాల్పడిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదులకు సంబంధించిన పూర్తి వివరాలను వాళ్లు వెల్లడించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ తెలిపింది. ఆ ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా (LeT)కు చెందిన పాకిస్తాన్ జాతీయులని కూడా ధృవీకరించినట్లు పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
దీని ప్రకారం- దాడికి ముందు పర్వేజ్, బషీర్.. ఆ ముగ్గురు సాయుధ ఉగ్రవాదులకు హిల్ పార్క్ లోని ఓ గుడిసెలో ఆశ్రయం కల్పించారు. వారికి ఆహారాన్నీ సమకూర్చారు. అలాగే- రవాణా వసతిని సైతం అందుబాటులో ఉంచినట్లు ఎన్ఐఏ వివరించింది. వారి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టుకుంటోన్నట్లు ఎన్ఐఏ తెలిపింది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications