బ్రిటన్తో సీబీఐ అప్రోచ్: లండన్ నుంచి బ్రస్సెల్ పారిపోయిన నీరవ్ మోడీ
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కుంభకోణంలో సుమారు రూ. 13వేల కోట్లు కాజేసిన ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ లండన్లో ఉన్నట్లుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అతడిని దేశానికి రప్పించేందుకు బ్రిటన్ అధికారులతో భారత్ చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో నీరవ్ మోడీ లండ్ నుంచి బ్రసెల్స్ పారిపోయినట్లు తెలిసింది.
పీఎన్బీ స్కాం చాలా రోజుల ముందే భారత్ నుంచి పారిపోయిన నీరవ్ మోడీ ఆ తర్వాత అనేక దేశాలు తిరిగాడు. అయితే అతడు లండన్ చేరుకున్నాడని, యూకే ప్రభుత్వం నుంచి రాజకీయ ఆశ్రయం కోరేందుకు ప్రయత్నిస్తున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో ఈ విషయమై భారత అధికారులు యూకే ప్రభుత్వాన్ని సంప్రదించారు.

ఈ నేపథ్యంలోనే నీరవ్ లండన్ నుంచి బ్రసెల్స్కు పారిపోయినట్లు తాజాగా మీడియా వర్గాల తెలిసింది. సింగపూర్ పాస్పోర్ట్పై ప్రయాణిస్తున్న నీరవ్.. ప్రస్తుతం బ్రసెల్స్కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం సింగపూర్ పాస్ పోర్టుపై తిరుగుతున్న నీరవ్ మోడీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం కుదరదు.
ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఏ దేశంలో ఉన్నాడో ఆచూకీ తెలియని పక్షంలో అంతర్జాతీయ సంస్థ ద్వారా డిఫ్యూసన్ నోటీసును జారీ చేసే అవకాశం దర్యాప్తు సంస్థలకు ఉంటుంది. దీంతో నీరవ్ ఆచూకీ కోసం ఇంటర్పోల్ ఛానల్ ద్వారా సీబీఐ బ్రిటన్ ప్రభుత్వానికి ఈ నోటీసులిచ్చింది.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications