
నీరవ్ మోదీకి భారీ షాకిచ్చిన సోదరి పూర్వీ మోదీ -అప్రూవర్గా మారి, ఈడీకి రూ.17కోట్లు చెల్లింపు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకున్న వేల కోట్ల అప్పులు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నీరవ్ సోదరి పుర్వీ మోదీ.. భారత ప్రభుత్వానికి రూ. 17.25 కోట్లు చెల్లించుకున్నారు.
పీఎన్బీ కేసులో ఇదివరకే అప్రూవర్గా మారిన ఆమె.. యూకేలోని తన బ్యాంకు ఖాతా నుంచి ఈ మొత్తం పంపినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా వెల్లడించింది. జూన్ 24న ఈ మొత్తం పుర్వీ మోదీ ఖాతా నుంచి భారత ప్రభుత్వ ఖాతాకు బదిలీ అయినట్లు తెలిపింది. తన సోదరుడు నీరవ్ సూచన మేరకు పుర్వీ ఈ ఖాతా తెరిచారని, అయితే, అందులోని నగదుతో ఆమెకు సంబంధం లేదని ఈడీ పేర్కొంది.
కేంద్ర
కేబినెట్
విస్తరణ:
వీరికే
చోటు
-5రాష్ట్రాల
ఎన్నికల
నేపథ్యంలో
మోదీ,
బీజేపీ
కీలక
అడుగులు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను మోసగించిన కేసు విషయంలో సహకరించేందుకు పుర్వీ మోదీ, ఆమె భర్త మయాంక్ మెహతాకు జనవరిలో ఈడీ అనుమతిచ్చింది. దీంతో ఆమె అప్రూవర్గా మారింది. ఈ క్రమంలో పుర్వీ మోదీ.. 2316889.03 డాలర్లను తన యూకే ఖాతా నుంచి భారత ప్రభుత్వానికి పంపించారని ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది.
పుర్వీ మోదీ సహకారంతో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. అప్రూవర్లుగా మారడంతో పూర్వీ, ఆమె భర్త మయాంక్ లపై చర్యలు తీసుకోకుండా ఈడీ క్షమాభిక్ష ప్రసాదించింది. మరోవైపు ప్రస్తుతం నీరవ్ మోదీ యూకే జైలులో ఉన్నాడు. భారత్కు అప్పగించకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.