రాక్షసుడు: 16మంది చిన్నారులపై రేప్, హత్య
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాపం పుణ్యం తెలియని 16మంది బాలికలను అత్యాచారం చేసి, ఆపై హత్యలు చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
డీఎస్పీ విక్రమ్జీత్సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. రవీంద్రకుమార్(24)అనే వ్యక్తి 2009 నుంచి ఇప్పటి వరకు మొత్తం 16 మంది (మూడు నెలల నుంచి నాలుగేళ్ల వయస్సు) బాలికలను అత్యాచారం చేసి హత్య చేశాడు.
హర్యానా, ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లో చిన్నారులకు చాక్లెట్లు ఇప్పిస్తానని.. ఎవరులేని ప్రదేశంలోకి తీసుకెళ్లి వారిపై అఘాయిత్యాలకు పాల్పడి చంపేసినట్లు తెలిపారు. జులై 14న బేగంపురాలో ఆరేళ్ల బాలిక అదృశ్యమైంది.

అనంతరం ఇంటికి సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవనంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నివేదికలో బాలికపై అత్యాచారం జరిగాక చంపబడిందని తేలింది. సంఘటన స్థలంలో దొరికిన డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా రవీంద్రను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
శుక్రవారం నిందితుడు రవీంద్రకుమార్ను అరెస్ట్ చేసిన పోలీసులకు.. అతడ్ని విచారించగా అతను చేసిన ఘోరాలు బయటపడ్డాయి. నిరుడి ఓ బాలుడిపై అత్యాచారానికి ప్రయత్నించి దొరికిపోయిన నిందితుడు, ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. జైలు కెళ్ళినా మారని నిందితుడు ఈ ఘోరాలకు పాల్పడ్డాడు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications