ఇకపై చైను లాగినా రైలు ఆగదు: ఫోన్ కొడితేనే..
లక్నో: ఇకపై చైను లాగితో రైలు ఆగకపోవచ్చు. ఎందుకంటే రైల్వే మంత్రిత్వ శాఖ త్వరలోనే చైను విధానాన్ని తొలగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇష్టానుసారం ఎవరుపడితే వారు చైను లాగి రైళ్లను ఆపడం వల్ల రైల్వేకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లుతోందనే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
అత్యవసర పరిస్థితిల్లోనే ఉపయోగించాల్సిన గొలుసును.. చీటికి మాటికి ఎవరో ఒకరు లాగడం వల్ల రైళ్లు చాలా ఆలస్యమవుతున్నాయని ఓ అధికారి తెలిపారు. ఆలస్యం వల్ల రైల్వేకు రూ. 3వేల కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. అందుకే గొలుసు విధానాన్ని తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఉత్తరప్రదేశ్ బరేలీలోని ఇజ్జత్నగర్లో రైళ్లలో చైన్లు తొలగించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని అధికారులు చెప్పారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో రైలు ఆపాలంటే ప్రత్యామ్నాయ మార్గంగా ఫోన్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.

ఇందు కోసం రైలు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ల ఫోన్ నెంబర్లను ప్రతీ కోచ్లో డిస్ ప్లే అయ్యేట్లు ఏర్పాట్లు చేయనున్నారు. ప్యాసింజర్లు అత్యవసర పరిస్థితిలో వారికి ఫోన్ చేసి రైలు ఆపించవచ్చు.
ఇక మీదట తయారు చేసే కొత్త కోచ్లలో అలారం చైన్లు ఉండవని ఇజ్జత్నగర్ రైల్వే అధికారి రాజేంద్ర సింగ్ తెలిపారు. ఈ మేరకు రైల్వే శాఖ నుంచి ఇప్పటికే ఆదేశాలు అందినట్లు చెప్పారు. ప్రతీ రైలులో మూడు కోచ్లకు వాకీటాకీతో ఓ సిబ్బంది పని చేస్తాడని తెలిపారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications