'మారని అమెజాన్ తీరు': చెప్పులపై మహాత్ముడి చిత్రం
చెప్పులపై మహత్ముడి చిత్రాన్ని ముద్రించి విక్రయానికి పెట్టింది అమెజాన్ సంస్థ, అమెజాన్ తన తీరును మార్చుకోలేదు. ఈ ఘటనపై నెటిజన్లు అమెజాన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
న్యూఢిల్లీ:అమెజాన్ తీరు మార్చుకోవడం లేదు. డోర్ మ్యాట్ లపైభారత త్రివర్ణ పతాకం ముద్రించి అమ్మకానికి పెట్టింది. ఈ వివాదాన్ని మరిచిపోకముందే చెప్పులపై మహత్యగాంధీ చిత్రాన్ని ముద్రించి అమ్మకానికి పెట్టింది అమెజాన్.అమెజాన్ తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు.
డోర్ మ్యాట్ పై భారత జాతీయ పతాకాన్ని ముద్రించి అమ్మాకానికి పెట్టింది అమెజాన్. అయితే ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ మంత్రి సుస్మాస్వరాజ్ తీవ్రంగా స్పందించారు. దీంతో డోర్ మ్యాట్ లను తన పైట్ నుండి అమెజాన్ తీసివేసింది.
మరో వైపు మహత్మాగాంధీ చిత్రాన్ని చెప్పులపై ముద్రించి విక్రయానికి పెట్టింది అమెజాన్. ఇది గమనించిన ట్విట్టర్ యూజర్లు దీన్ని బాగా ప్రచారమయ్యేలా చేశారు. ప్రధానమంత్రి మోడీ, సుష్మా స్వరాజ్ లను టగ్యాగ్ చేసి ఈ పోటోను పోస్ట్ చేశారు.
ఈ చెప్పులకు 16.99 డాలర్లని అమెజాన్ ప్రకటించింది. తమ సెంటిమెంట్ ను గౌరవించాలని భారత విదేశాంగ శాఖ అమెజాన్ ను కోరింది. సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ ప్రారంభమైన తర్వాత అమెజాన్ ఈ చెప్పులను తన సైట్ నుండి తొలగించింది.