నా పని నేను చేశా, అంతే: మన్మోహన్ నో కామెంట్
న్యూఢిల్లీ: తన అలసత్వం వల్లనే 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణాలు జరిగాయని ‘కాగ్' మాజీ చీఫ్ వినోద్ రాయ్ చేసిన విమర్శలపై స్పందించేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిరాకరించారు. ‘‘నా పని నేను చేశా. ఇతరులు ఏమి రాశారనే దానిపై నేను చెప్పేదేమీ లేదు'' అన్నారు.
తన కుమార్తె దమన్ సింగ్ రాసిన ‘స్ర్టిక్ట్లీ పర్సనల్ : మన్మోహన్ అండ్ గురుచరణ్' పుస్తకానికి సంబంధించి ఆదివారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మన్మోహన్ సింగ్ను మీడియా ప్రతినిధులు వినోద్ రాయ్ విమర్శలపై ప్రశ్నించారు.

2జీ స్పె క్ట్రం, బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలు జరుగుతున్నాయని తెలిసినా మన్మోహన్ సింగ్ పట్టించుకోలేదని కాగ్ మాజీ చీఫ్ ఆరోపించారు. మన్మోహన్ సింగ్ కల్పించుకుని ఉంటే అసలు ఈ కుంభకోణాలు చోటు చేసుకుని ఉండేవే కావని తన పుస్తకంలో అన్నారు.
మన్మోహన్ సింగ్పై కాగ్ మాజీ చీఫ్ చేసిన ఆరోపణలపై మాట్లాడేందుకు ఆయన తనయ దమన్ సింగ్ కూడా నిరాకరించారు. తన పుస్తకంలో తల్లి దండ్రులకు సంబంధించి అనేక వివరాలు వెల్లడించిన దమన్ సింగ్, ప్రధానిగా మన్మోహన్ సింగ్ పదేళ్ల జీవితానికి సంబంధించి మాత్రం ఎలాంటి వివరాలూ ఇవ్వలేదు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications