టాప్ 200 వర్సిటీల్లో భారత్కు దక్కని చోటు

గత ఏడాది క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో మొదటి స్దానంలో ఉన్న ఐఐటీ ఢిల్లీ, ఈ సారి సెకండ్ ర్యాంక్కు పడిపోయి, ప్రపంచ వ్యాప్తంగా 235వ స్దానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్ లో ఐఐటీ మద్రాస్ (321), ఐఐటీ ఖరగ్ పూర్ (324), ఐఐటీ రూర్కీ (461) , యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ(430), ఐఐటీ గౌహతి (551), యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా (650) ప్లేసుల్లో ఉన్నాయి.
మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరుసగా రెండో ఏడాది తొలిస్థానంలో నిలవగా, లండన్ లోని ఇంపేరియల్ కాలేజి, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఆసియా నుంచి నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్కు అత్యుత్తమంగా 22వ ర్యాంకు లభించింది.












Click it and Unblock the Notifications