వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక వర్గాన్నే టార్గెట్ చేస్తే గందరగోళం - మొహర్రంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు - ఊరేగింపులకు నో

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా వ్యాప్తికి మతాలను ముడిపెడుతూ విద్వేషం వెళ్లగక్కుతోన్న తీరును న్యాయస్థానాలు మరోసారి గర్హించాయి. తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన విదేశీ ముస్లింలను బలిపశులు చేశారంటూ బాంబే హైకోర్టు(ఔరంగాబాద్ బెంచ్) గతవారం ఆగ్రహం వ్యక్తం చేయగా, మొహర్రం పండుగపై దాఖలైన పిటిషన్ ను విచారిస్తూ గురువారం సుప్రీంకోర్టు సైతం వర్గాలను టార్గెట్ చేయడంపై అనూహ్య వ్యఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే..

చైనా ప్రతీకార చర్య: మిస్సైల్స్ ఫైరింగ్ - అమెరికా ఉల్లంఘనకు రిటార్ట్ - ఒక మిస్సైల్ భారత్‌కు సమీపంగాచైనా ప్రతీకార చర్య: మిస్సైల్స్ ఫైరింగ్ - అమెరికా ఉల్లంఘనకు రిటార్ట్ - ఒక మిస్సైల్ భారత్‌కు సమీపంగా

కొవిడ్ లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో ఈ నెల 30న జరిగే మొహర్రం పండుగకు మినహాయింపు ఇవ్వాలని, ఆ రోజు చేసే ఊరేగింపులకు అనుమతివ్వాలని, ఈ మేరకు దేశమంతటికీ వర్తించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిల్ దాఖలైంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన షియా ముస్లిం లీడర్ సయీద్ కల్బే జవాద్ దాఖలు చేసి పిల్ ను.. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం బెంచ్ గురువారం విచిరించింది.

 No Muharram processions, but general order will be chaos sys Supreme Court

మొహర్రం పండుగ సందర్భంగా ఊరేగింపులకు అనుమతించబోమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. దీనికి సంబంధించి దేశం మొత్తానికి వర్తించేలా సాధారణ ఉత్తర్వులను మాత్రం జారీ చేయబోమని పేర్కొంది. ''మీరు జనరల్ ఆర్డర్ కోసం అడుగుతున్నారు. దాన్నే గనుక మేం అనుమతిస్తే గందరగోళ పరిస్థితి (కేయాస్) ఏర్పడుతుంది. కరోనాను వ్యాపింపజేస్తున్నారంటూ ఒక వర్గం టార్గెట్ గా మారే అవకాశం ఏర్పడుంది. అది మాకు ఇష్టం లేదు. సర్వోన్నత న్యాయస్థానంగా ప్రజల ఆరోగ్యాన్ని రిస్కులో పెట్టే పని కూడా మేము చేయలేము'' అని చీఫ్ జస్టిస్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది.

 No Muharram processions, but general order will be chaos sys Supreme Court

Recommended Video

NEET, JEE Main 2020 : No Postponement, Govt | 7 Non BJP States to Move Supreme Court || Oneindia

పిటిషనర్ సయీద్.. లక్నో ప్రాంతానికి చెందినవాడు కావడంతో ఈ వ్యవహారాన్ని అలహాబాద్ హైకోర్టులోనే తేల్చుకోవాలని సూప్రీంకోర్టు సూచించింది. ఆ మేరకు పిటిషనర్ అంగీకరించడంతో కేసును డిస్మిస్ చేశారు. ఇదిలా ఉంటే, పలు రాష్ట్రాల హైకోర్టుల్లోనూ మొహర్రం ఊరేగింపులకు అనుమతి కోరుతూ పిటిషన్లు దాఖలుకాగా, దాదాపు అన్నీ కొట్టుడుపోయాయి. హైద‌రాబాద్‌లో మొహ‌ర్రం ఊరేగింపున‌కు తెలంగాణ హైకోర్టు సైతం అనుమతి నిరాకరించింది. ఈ నెల 30న డబీర్‌పురా బీబీకాఆలం నుంచి చాదర్‌ఘాట్‌ వరకు అంబారీ ఊరేగింపునకు అనుమతి ఇవ్వాలన్న పిటిషన్ ను కొట్టేసింది.

అలర్ట్: నలుగురు కరోనా ఖైదీలు పరార్ - గాంధీ ఆస్పత్రి గ్రిల్స్ తొలగించి జంప్ - వాళ్ల వివరాలివే..అలర్ట్: నలుగురు కరోనా ఖైదీలు పరార్ - గాంధీ ఆస్పత్రి గ్రిల్స్ తొలగించి జంప్ - వాళ్ల వివరాలివే..

English summary
The Supreme Court Thursday declined permission for carrying out Muharram processions across the country and asked Lucknow-based petitioner to move before the Allahabad High Court with his plea. The apex court said how can it pass a general order for the whole country, if allow this there will be chaos.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X