భయం వద్దని ఖుష్బూ, జయలలితకు సవాల్ (పిక్చర్స్)
చెన్నై: ప్రముఖ నటి, డిఎంకె నాయకురాలు ఖుష్బూ తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత పైన విరుచుకుపడ్డారు.
జయలలిత ప్రకటనల పైన, ఆమె ఎన్నికల కలల పైన ఖుష్బు తనదైన శైలిలో స్పందించారు. అదే సమయంలో అన్ని స్థానాలు గెలుచుకుంటామన్న జయలలితకు ఆమె సవాల్ చేశారు.
ఖుష్బూ తమిళనాడులోని తిరుచ్చిలో జరిగిన డిఎంకె పార్టీ సమావేశంలో మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల గురించి ఎవరు భయపడనవసరం లేదని ఖుష్పూ పార్టీ క్యాడర్కు సూచించారు.
ఖుష్బూ 1
ప్రముఖ నటి, తమిళ పార్టీ డిఎంకె నాయకురాలు ఖుష్బూ తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత పైన విరుచుకుపడ్డారు.
ఖుష్బూ 2
జయలలిత ప్రకటనల పైన, ఆమె ఎన్నికల కలల పైన ఖుష్బు తనదైన శైలిలో స్పందించారు. అదే సమయంలో జయలలితకు ఆమె సవాల్ చేశారు.
ఖుష్బూ 3
ఖుష్బూ తమిళనాడులోని తిరుచ్చిలో జరిగిన డిఎంకె పార్టీ సమావేశంలో మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల గురించి ఎవరు భయపడనవసరం లేదని ఖుష్పూ పార్టీ క్యాడర్కు సూచించారు.
ఖుష్బూ 4
2014 సార్వత్రిక ఎన్నికలలో డిఎంకె పార్టీ తప్పకుండా 40 లోకసభ స్థానాలను ఖచ్చితంగా గెలుచుకుంటుందని ఖుష్బూ ధీమా వ్యక్తం చేశారు.
ఖుష్బూ 5
దక్షిణాదితో పాటు హిందీ చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటి ఖుష్బూ నాలుగేళ్ల క్రితం కరుణానిధి నేతృత్వంలోని డిఎంకె పార్టీలో చేరారు.