'ప్రభుత్వ ఉద్యోగులు... ప్రైవేట్ ఇ-మెయిల్ సర్వీసులను వాడొద్దు"
న్యూఢిల్లీ: ప్రభుత్వ సమాచారం పంపేందుకు అధికారిక ఇ-మెయిల్స్ మాత్రమే ఉపయోగించాలని, ప్రైవేట్ ఇ-మెయిల్స్ వాడరాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతే కాకుండా ఉద్యోగుల వ్యక్తిగత ఈ మెయిల్ ఐడీ నుంచి అధికారిక సమాచారాన్ని పంపడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆదేశాల ప్రకారం ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ఐఏ (ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ) ద్వారానే అధికారిక సమాచారాన్ని పంపించాల్సి ఉంటుంది.

ఇండియా సహా పలు దేశాల ఇంటర్నెట్ డేటాపై అమెరికా నిఘా పెట్టిందన్న ఎడ్వర్డ్ స్నోడేన్ హెచ్చరికల తర్వాత, డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగం సర్వర్ల ద్వారానే ఇ-మెయిల్స్ పంపాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications