నా పర్యటనల్లో ప్రత్యేక ఏర్పాట్లు, ఆర్భాటాలు వద్దు: అధికారులకు సీఎం యోగి ఆదేశాలు
తాను పర్యటించే ప్రాంతాల్లో తన కోసం ఎటువంటి ఆర్భాటాలు, ప్రత్యేక ఏర్పాట్లు చేయవద్దని ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర అధికారులను ఆదేశించారు.
లక్నో: తాను పర్యటించే ప్రాంతాల్లో తన కోసం ఎటువంటి ఆర్భాటాలు, ప్రత్యేక ఏర్పాట్లు చేయవద్దని ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర అధికారులను ఆదేశించారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవల రెండు ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో అధికారులు చేసిన హడావుడి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అవి వివాదాస్పదంగా మారడంతో వాటిపై సీఎం యోగి కూడా సీరియస్ అయ్యారు.
ఈ మేరకు ఆయన ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 'మనం నేలపై కూర్చొని ఉండేవాళ్లమే, అందుకే ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ వద్దు. ముఖ్యమంత్రి అనే గౌరవం ఉంటే చాలు' అని తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

గతనెల బీఎస్ఎఫ్ జవాను ప్రేమ్ సాగర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం వెళ్లిన సమయంలో ఆ ఇంటిని అధికారులు ఖరీదైన వస్తువులతో నింపారు. సీఎం వెళ్లిపోగానే అధికారులు ఇంట్లో పెట్టిన ఏసీ, సోఫా తదితరాలను తీసేశారు.
దాంతో తమను అధికారులు అవమానించారంటూ అమరజవాను సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. గతవారం కూడా సీఎంను కలిసేందుకు వచ్చే ప్రజలను స్నానాలు చేసి రావాలంటూ సబ్బులు, షాంపూలు ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications