ఉత్తర కొరియా ఒక క్రిమినల్ సిండికేట్గా మారిందన్న అమెరికా : Newsreel

ప్రపంచ వ్యాప్తంగా వివిధ వ్యాపార సంస్థలు, బ్యాంకుల నుంచి 130 కోట్ల డాలర్ల (సుమారు 9,400 కోట్ల రూపాయిలు) సొమ్మును చోరీ చేసి అపహరించిన నేరానికి గాను అమెరికా ముగ్గురు ఉత్తర కొరియా పౌరుల పై అభియోగాలను నమోదు చేసింది.
దీనితో పాటు ఈ ముగ్గురు అతి ప్రమాదకరమైన క్రిప్టో కరెన్సీ ప్రోగ్రాంలను ఉపయోగిస్తున్నారని కూడా ఆరోపణలు చేశారు. వీరిని ఇంకా నిర్బంధంలోకి తీసుకోలేదు.
వీరితో పాటు మరో కెనడా-అమెరికా పౌరుడిపై కూడా మనీ లాండరింగ్ అభియోగం నమోదు చేశారు.
వీరంతా 2017లో జరిగిన వాన్నాక్రై (Wannacry) సైబర్ దాడిలో పాల్గొన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ దాడి వల్ల యూకె లో వైద్య రంగానికి చెందిన కంప్యూటర్ సేవలు జాతీయ స్థాయిలో దెబ్బ తిన్నాయి.
"ఉత్తర కొరియా ఒక క్రిమినల్ సిండికేట్ గా మారిందని" అమెరికా జాతీయ భద్రత విభాగం అసిస్టెంట్ అటార్నీ జనరల్ జాన్ డెమెర్స్ ఈ అభియోగాలను ప్రకటిస్తూ అన్నారు. వీరిలో ఒక నిందితుడు పార్క్ జిన్ హోక్ రెండేళ్ల క్రితం 2014లో సోనీ ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్ కి సంబంధించిన హ్యాకింగ్ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్నారు.

ముగ్గురు నిందితులు పార్క్, జోన్ చాంగ్ హోక్, కిమ్ II నేర పూరిత కుట్ర, వైర్ ఫ్రాడ్, బ్యాంకు ఫ్రాడ్ చేసినందుకు గాను ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
వీరంతా ఉత్తర కొరియా మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన రికనాయిసెన్స్ జనరల్ బ్యూరో కోసం పని చేస్తున్నారని అమెరికా న్యాయశాఖ తెలిపింది. "ఉత్తర కొరియాలో నేర నిర్వాహకులు తుపాకీలకు బదులు కీ బోర్డులను వాడి బస్తాల కొద్దీ డబ్బులకు బదులు క్రిప్టో కరెన్సీ డిజిటల్ వాలెట్లను దొంగలిస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద బ్యాంకు దొంగలుగా తయారయ్యారు" అని డెమెర్స్ చెప్పారు. ఈ ముగ్గురు నిందితులు ఉత్తర కొరియాలోనే ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే, ఉత్తర కొరియా తన పౌరులను నేర విచారణ కోసం అమెరికాకు అప్పగించదు.

ఇవి కూడా చదవండి:
- 'విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అంటూ సాగిన పోరాటంలో పోలీసు కాల్పులకు 32 మంది మృతి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలా సాధించుకున్నారంటే
- మాన్య సింగ్: ఆటో డ్రైవర్ కూతురు మిస్ ఇండియా రన్నరప్ వరకు ఎలా ఎదిగారు?
- ''బూజు పట్టిందని రూ.పది వేల కోట్ల ప్యాలెస్ను కూల్చి, మళ్లీ కడుతున్నారు’’
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- డోనల్డ్ ట్రంప్కు అభిశంసన ఆరోపణల నుంచి విముక్తి... సెనేట్లో వీగిపోయిన తీర్మానం
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
- సెక్స్ సమయంలో శరీరంలో చేరి ప్రాణాలకే ముప్పు తెచ్చే ఈ బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- సెక్స్ పట్ల సమాజానికి గౌరవం ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications